ETV Bharat / sitara

ఈ బతుకు అవసరమా అనిపించింది: నటి శ్రీలక్ష్మి

author img

By

Published : Feb 10, 2021, 2:26 PM IST

'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైన నటీమణులు శ్రీలక్ష్మి, హేమ.. పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. తమ మనసులోని భావాల్ని పంచుకున్నారు.

hema, sri lakshmi in ALI tho saradaga talk show
ఈ బతుకు అవసరమా అనిపించింది: నటి శ్రీలక్ష్మి

'ఆ రోజుల్లో మనకు కష్టం వస్తే చెప్పుకోగానే తీర్చే వాళ్లుండేవారు. కానీ, ఈ రోజుల్లో అలా లేదనిపిస్తోంది.. నమ్ముతారో, నమ్మరో నా బాధను గోడలతో పంచుకుంటున్నా. ఒకానొక సమయంలో మా సోదరుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని చెప్పినా.. ఇదొక్క షాట్‌ తీసి వెళ్లమన్నారు. ఆఖరికి నేను వెళ్లేలోపే ఆయన చనిపోయారు. అప్పుడు ఛీ.. ఈ బతుకు అవసరమా అనిపించింది' అని తన మనసులోని ఆవేదన వ్యక్తం చేశారు నటి శ్రీలక్ష్మి.

ప్రముఖ హాస్య నటుడు ఆలీ వ్యాఖ్యాతగా 'ఈటీవీ'లో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా'లో నటులు శ్రీలక్ష్మి, హేమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

'కెమెరా ముందు హాయిగా నవ్వుతూ నటిస్తాం.. కానీ,' అని హేమ కూడా తన కష్టాలను గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. పూర్తి కార్యక్రమం ఫిబ్రవరి 15న ప్రసారం కానుంది. ఈలోగా ప్రోమోపై ఓ లుక్కేయండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.