ETV Bharat / opinion

Mizoram MLA Candidates Assets : అసెంబ్లీ ఎన్నికల బరిలో 112మంది కోటీశ్వరులు.. రిచ్చెస్ట్ అభ్యర్థిగా 'ఆప్'​ నేత

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 25, 2023, 3:15 PM IST

Updated : Oct 26, 2023, 10:37 AM IST

Mizoram MLA Candidates Assets : ఎన్నికల్లో పోటీ అంటే ఖర్చుతో కూడిన వ్యవహారమనే వాదనకు మిజోరం శాసనసభ సంగ్రామం బలాన్నిస్తోంది. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు సంపన్నులైన అభ్యర్థులను బరిలో దించాయి. మిజోరంలో 40 అసెంబ్లీ స్థానాల్లో 174 మంది పోటీ చేస్తుండగా.. అందులో వంద మందికి పైగా కోటీశ్వరులు ఉన్నారు. రూ.69 కోట్ల ఆస్తులతో ఆప్‌ అభ్యర్థి అత్యంత ధనవంతుడిగా నిలిచారు.

Mizoram MLA Candidates Assets
Mizoram MLA Candidates Assets

Mizoram MLA Candidates Assets : దేశంలోని చిన్న రాష్ట్రాల్లో మిజోరం ఒకటి. అక్కడ 40 శాసనసభ స్థానాలు ఉండగా.. ఈసారి స్వతంత్రులు సహా అన్ని పార్టీల తరపున 174 మంది పోటీలో ఉన్నారు. అందులో ఏకంగా 112 మంది అభ్యర్థులు కోటీశ్వరులు ఉన్నారు. వారందరిలో ఆప్‌ మిజోరం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ఉత్తర ఐజ్వాల్‌-3 నుంచి పోటీ చేస్తున్న ఆండ్రూ లాల్రేంకిమా పచుఔ రూ.69 కోట్ల ఆస్తులతో అత్యంత ధనవంతుడైన అభ్యర్థిగా అగ్రస్థానంలో నిలిచారు.

Mizoram MLA Candidates Assets
మిజోరం ఎన్నికల బరిలో కోటీశ్వరులు!

నామినేషన్ల సందర్భంగా దాఖలు చేసిన ప్రమాణపత్రాల ప్రకారం.. మిజోరం ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 64.4శాతం మంది కోటి రూపాయలకుపైగా ఆస్తులు కలిగి ఉన్నారు. సెర్చిప్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో ఉన్న ఆర్‌.వన్లాల్‌ట్లుంగా రూ.55.6 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో నిలిచారు. జోరం పీపుల్స్‌ మూవ్‌మెంటు తరఫున చంపాయ్‌ నుంచి పోటీ చేస్తున్న H.గింజాలాల రూ.36.9 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో ఉన్నారు. ఈ ఆస్తులన్నీ వ్యాపారం ద్వారా సంపాదించినట్లు కోటీశ్వరులైన అభ్యర్థులు తమ ప్రమాణ పత్రంలో పేర్కొన్నారు.

సెర్‌చిప్‌ స్థానం నుంచి స్వతంత్రునిగా పోటీ చేస్తున్న రామ్‌లున్-ఈడెన్ అత్యంత నిరుపేద అభ్యర్థిగా నిలిచారు. ఈయన కేవలం రూ.1500 విలువ చేసే చరాస్తులు మాత్రమే కలిగి ఉన్నట్లు ప్రమాణపత్రంలో పేర్కొన్నారు. 2018 ఎన్నికల్లో MNF అభ్యర్థి లాల్‌రినేంగా సైలో వందకోట్ల ఆస్తులతో అత్యంత ధనవంతునిగా నిలిచారు. తూర్పు ఐజ్వాల్‌-2 నుంచి పోటీ చేసిన ఆ పార్టీకే చెందిన రాబర్ట్‌ రొమావియా రూ.44కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో ఉన్నారు. అయితే ఈసారి వారి ఆస్తులు తరిగిపోయాయి. సైలో ఆస్తులు వందకోట్ల నుంచి రూ.26.24 కోట్లకు, రాబర్ట్ సంపద రూ.32.24కోట్ల తగ్గింది.

16 మంది మహిళా అభ్యర్థుల్లో కాంగ్రెస్‌ నామినీ మరియం రూ.18.63 కోట్ల ఆస్తులతో అగ్రస్థానంలో ఉన్నారు. MNF అధ్యక్షుడు, మిజోరం సీఎం జోరాంథంగా రూ.5 కోట్ల ఆస్తులతో ధనవంతులుగా ఉన్న ఐదు రాజకీయ పార్టీల అధ్యక్షుల్లో ఒకరిగా నిలిచారు. ZPM తరఫు సీఎం పదవి రేసులో ఉన్న లాల్దుహోమ రూ.4కోట్ల ఆస్తులతో తర్వాత స్థానంలో నిలిచారు. మిజోరం రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు, పశ్చిమ ఐజ్వాల్‌-3 నుంచి పోటీ చేస్తున్న లాల్‌సవ్‌తా రూ.6కోట్ల ఆస్తులు కలిగి ఉన్నట్లు ప్రకటించారు. ZPM తరఫున ముగ్గురు, MNF, బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ఒక్కో అభ్యర్థిపై క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Mizoram Elections 2023 : మిజోరంలో త్రిముఖ పోరు.. ఆనవాయితీని నమ్ముకున్న MNF.. వ్యతిరేక ఓటుపై కాంగ్రెస్ ఆశలు

Madhya Pradesh Elections Family Battle : మామాఅల్లుళ్లే ప్రత్యర్థులు.. బావామరదళ్ల మధ్య ఢీ.. పరి'వార్'​లో విజయమెవరిదో?

Last Updated : Oct 26, 2023, 10:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.