ETV Bharat / jagte-raho

ఎల్లమ్మ ఆలయంలో దొంగతనం.. ఆభరణాలు మాయం

author img

By

Published : Jan 11, 2021, 12:45 PM IST

theft at kodurupaka yellamma temple in rajanna sircilla district
కొదురుపాక ఎల్లమ్మ ఆలయంలో దొంగతనం.

ఎల్లమ్మ ఆలయంలో చొరబడి హుండీలోని ఆభరణాలు ఎత్తికెళ్లిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాకలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్​ టీంతో ఆధారాలు సేకరించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక ఎల్లమ్మ ఆలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి ఆలయంలోకి చొరబడి హుండీలోని ఆభరణాలు ఎత్తుకెళ్లారు.

ఉదయాన్నే గమనించిన ఆలయ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్​ టీంతో ఆధారాలు సేకరించారు. దాదాపు రూ.5లక్షల విలువగల ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.