ETV Bharat / jagte-raho

అక్రమ మైనింగ్ కేసు.. 25 చోట్ల సీబీఐ సోదాలు

author img

By

Published : Nov 19, 2020, 8:25 PM IST

ఏపీలోని గుంటూరు అక్రమ మైనింగ్ కేసు దర్యాప్తులో భాగంగా... ఏపీలో 25 చోట్ల సీబీఐ సోదాలు చేసింది. తెదేపా మాజీ ఎమ్మెల్యే ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు.

CBI
అక్రమ మైనింగ్ కేసు.. 25 చోట్ల సీబీఐ సోదాలు

గుంటూరు అక్రమ మైనింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ సోదాలు నిర్వహించింది. ఏపీలోని 25 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు సోదాలు చేశారు. గురజాల మాజీ ఎమ్మెల్యే ఇంట్లోనూ తనిఖీలు చేపట్టింది.

అక్రమ మైనింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని గతంలోనే ఏపీ హైకోర్టు ఆదేశించింది. వైకాపా ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. అక్రమ మైనింగ్‌ కేసులో సీబీఐ అప్పట్లో 17 మందిపై కేసు నమోదు చేసింది. కోనంకి, దాచేపల్లి, కేతనపల్లి, నడికుడిలో అక్రమ మైనింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దాచేపల్లి, పిడుగురాళ్ల పోలీసు స్టేషన్లలో నమోదైన కేసులను సీబీఐ పరిగణలోకి తీసుకుంది.

ఇవీచూడండి: హైదరాబాద్​లో డ్రగ్స్​ విక్రయిస్తున్న ముగ్గురి అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.