ETV Bharat / jagte-raho

వసతి గృహంలో అనారోగ్యంతో వృద్ధుడు మృతి

author img

By

Published : Dec 31, 2020, 12:32 PM IST

కొద్దిరోజులుగా సికింద్రాబాద్​లోని ఓ ప్రైవేటు వసతి గృహంలో ఉంటున్న వృద్ధుడు అనారోగ్యంతో మృతి చెందాడు. అనారోగ్యం కారణంగానే వెంకటరామన్ మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

An old man died in a hostel in Secunderabad
సికింద్రాబాద్​లోని వసతిగృహంలో వృద్ధుడు మృతి

సికింద్రాబాద్​లోని ఓ ప్రైవేటు వసతిగృహంలో సిద్దిపేటకు చెందిన ఆర్.వెంకటరామన్(62)​ మృతి చెందాడు. తాను ఉద్యోగం కోసం నగరానికి వచ్చానని చెప్పి ఒక గది అద్దెకు తీసుకున్నట్లు వసతి గృహ నిర్వాహకుడు లక్ష్మీకాంత్ తెలిపాడు. బుధవారం ఉదయం వెంకటరామన్​ను నిద్ర లేపేందుకు ప్రయత్నించగా.. అతను స్పందించకపోవడంతో 108కు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకొని పరీక్షించగా అప్పటికే మృతి చెందాడని నిర్ధరించారు.

వేపూరి లక్ష్మీకాంత్ మూడు సంవత్సరాలుగా వెస్ట్ మారేడుపల్లి శివఅరుణ కాలనీలో శ్రీరామ వసతిగృహాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ నెల 8న సిద్దిపేటకు చెందిన ఆర్.వెంకటరామన్(62) ఒక గది అద్దెకు తీసుకున్నాడు. అప్పటినుంచి గదిలోనే ఉంటున్న వెంకటరామన్ అనారోగ్యం కారణంగా స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. ఈనెల 27 న ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి.. వసతిగృహానికి తిరిగి వచ్చిన వెంకటరామన్​ను ఆరా తీయగా తన కిడ్నీలలో సమస్య ఉందని చెప్పాడు. అనారోగ్యం కారణంగానే వెంకటరామన్ మృతిచెంది ఉంటాడని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని మారేడుపల్లి ఎస్సై ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 72 గంటల్లో హత్య కేసును ఛేదించిన చైతన్యపురి పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.