ETV Bharat / international

'కరోనా విజృంభిస్తోంది.. ఆంక్షలను ఎత్తివేయలేం'

author img

By

Published : Nov 8, 2020, 7:38 PM IST

Sri Lanka to lift capital district lockdown; warns people to be more vigilant
ప్రపంచ వ్యాప్తంగా 5.3లక్షలు దాటిన కరోనా కేసులు

ప్రపంచ దేశాలపై కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొన్ని రోజులుగా సగటున రోజుకు 5లక్షలకుపైగా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటివరకు 5కోట్ల 3లక్షల మందికిపైగా వైరస్​ బారినపడ్డారు. వారిలో 12లక్షల 58వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్​ వ్యాప్తి దృష్ట్యా సింగపూర్​లో లాక్​డౌన్​ను కొనసాగిస్తున్నట్టు ఆ దేశ​ ప్రధాని లీ హ్సేన్​ లూంగ్​ తెలిపారు. ఆంక్షల్లో సడలింపు ఉండదని ఆయన స్పష్టం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ విలయతాండవం కొనసాగుతోంది. ఇప్పటివరకు 5కోట్ల 3లక్షల మందికిపైగా వైరస్​ బారినపడ్డారు. కొవిడ్​ సోకిన వారిలో 12.58 లక్షల మంది బలయ్యారు. 3.56 కోట్ల మందికిపైగా కరోనాను జయించగా.. ప్రస్తుతం 1.35కోట్ల యాక్టివ్​ కేసులున్నాయి.

కొవిడ్​ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని సింగపూర్​లో విధించిన లాక్​డౌన్​లో ఎలాంటి సడలింపులు ఉండవని ఆ దేశ ప్రధాని లీ హ్సేన్​ పేర్కొన్నారు. ఆ దేశంలో ఇప్పటివరకు 58వేలకుపైగా కరోనా సోకగా.. 28 మరణాలు నమోదయ్యాయి.

శ్రీలంక రాజధానిలో లాక్​డౌన్​ను ఎత్తివేస్తున్నట్టు ఆ దేశం ప్రకటించింది. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆ దేశంలో ఇప్పటివరకు 13,419 కరోనా కేసులు నమోదవ్వగా.. వారిలో 34 మంది చనిపోయారు.

  • కరోనా కేసుల పరంగా అగ్రస్థానంలో ఉన్న అమెరికాలో ఇప్పటివరకు 1.01 కోట్ల వైరస్​ కేసులు వెలుగుచూశాయి. వారిలో 2.43లక్షల మందిని కొవిడ్​ బలితీసుకుంది.
  • రష్యాలో ఒక్కరోజులోనే 20,498 కరోనా కేసులు బయటపడ్డాయి. బాధితుల సంఖ్య 17లక్షల 74వేలకు చేరింది. దీంతో కేసుల పరంగా నాలుగో స్థానానికి చేరింది రష్యా. ఆ దేశంలో కొత్తగా 286మంది మరణించడం వల్ల.. మొత్తం మృతుల సంఖ్య 30, 537కు పెరిగింది.
  • పోలండ్​లో వైరస్​ విజృంభిస్తోంది. మరో 24,785 మందికి కరోనా సోకింది. మొత్తం కేసుల సంఖ్య 5.46 లక్షలకు చేరింది. ఇప్పటివరకు అక్కడ 7,872 వైరస్​ మరణాలు సంభవించాయి.
  • నేపాల్​లో ఆదివారం ఒక్కరోజే 2,817 మందికి మహమ్మారి సోకినట్టు తేలింది. మొత్తం కేసుల సంఖ్య 1,94,453కు చేరింది. కొవిడ్​ ధాటికి మరో 21 మంది ప్రాణాలు కోల్పోగా.. చనిపోయిన వారి సంఖ్య 1,108కి పెరిగింది.
  • పాక్​లో మరో 1,436 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 3,43,189కు పెరిగింది. పొరుగు దేశంలో ఇప్పటివరకు 6,968 మరణాలు నమోదయ్యాయి.

ఇదీ చదవండి: జూన్​ నుంచి చైనాలోనే భారత నౌక.. సిబ్బంది ఆవేదన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.