ETV Bharat / international

'గ్లోబల్​ వార్మింగ్​ కట్టడిలో భారత్​, చైనా నిర్లక్ష్యం!'

author img

By

Published : Aug 1, 2021, 11:07 AM IST

global warming, unfccc
గ్లోబల్​ వార్మింగ్​ కట్టడిలో భారత్​, చైనాలు

గ్రీన్​హౌస్ ఉద్గారాలను తగ్గించే దిశగా చేపట్టాల్సిన నూతన ప్రణాళికలను ఐక్యరాజ్య సమితి వాతావరణ విభాగానికి సమర్పించడంలో భారత్​, చైనా విఫలమయ్యాయి. 110 దేశాల్లో 82 దేశాలు.. నిర్దేశించిన గడువులోపు తమ లక్ష్యాలను సమర్పించ లేదని ఐరాస తెలిపింది. దేశాలన్ని కలిసికట్టుగా ప్రయత్నిస్తేనే గ్లోబల్​ వార్మింగ్​ను రెండు శాతంలోపునకు పరిమితం చేయడం సాధ్యమవుతుందని చెప్పింది.

గ్రీన్ హౌస్​ ఉద్గారాలను తగ్గించడానికి అమలు చేయాల్సిన నూతన ప్రణాళికలను ఐక్యరాజ్య సమితికి సమర్పించడంలో విఫలమైన దేశాల జాబితాలో భారత్​, చైనా చేరాయి. ఐరాస నిర్దేశించిన గడువులోపు ఈ దేశాలు తమ లక్ష్యాలను సమర్పించలేకపోయాయని అధికారులు తెలిపారు.

గ్లోబల్​ వార్మింగ్​ కట్టడి కోసం తమ నూతన లక్ష్యాల వివరాలు అందజేయాలని ఐక్యరాజ్య సమితి.. 2021, జులై 31 వరకు గడువు విధించింది.

ఏప్రిల్​లోనే అమెరికా...

ప్రపంచంలో కర్బన ఉద్గారాలను అధికంగా విడుదల చేసే జాబితాలో చైనా మొదటి స్థానంలో ఉండగా.. భారత్​ మూడో స్థానంలో ఉంది. ఉద్గారాలను అధికంగా విడుదల చేసే రెండో దేశమైన అమెరికా.. ఏప్రిల్​లోనే తమ లక్ష్యాలను ఐక్యరాజ్య సమితికి సమర్పించింది. యునైటెడ్​ నేషన్స్​ ఫ్రేమ్​వర్క్​ కన్వెన్షన్​ ఆన్​ క్లైమేట్​ ఛేంజ్(యూఎన్​ఎఫ్​సీసీసీ)లో​ భాగమైన 110 దేశాల్లో 58శాతం దేశాలు మాత్రమే తన నూతన లక్ష్యాలను నిర్దేశించిన గడువులోగా సమర్పించాయని యూఎన్​ఎఫ్​సీసీసీ ఛైర్మన్​ పాట్రిసియా ఎస్పిసోనా తెలిపారు. ఈ వివరాలు అందించాల్సిన గడువు 2020 డిసెంబర్ నాటికే ముగిసినప్పటికీ... కరోనా కారణంగా జులై 31 వరకు పొడిగించినట్లు గుర్తు చేశారు.

"సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, సిరియా సహా మరో 82 దేశాలు తమ లక్ష్యాలను ఐరాసకు సమర్పించని జాబితాలో ఉన్నాయి. ఈ శతాబ్దం ముగిసేనాటికి గ్లోబల్​ వార్మింగ్​ను రెండు డిగ్రీల సెల్సియస్ లోపునకు పరిమితం చేయాలనే లక్ష్యం దిశగా దేశాలన్నీ చాలా తక్కువ చర్యలు చేపట్టాయి. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల ఏర్పడ్డ హీట్​వేవ్స్​, కరవులు, వరదలు వంటివి గ్లోబల్​ వార్మింగ్​ను కట్టడి చేయాలనేందుకు హెచ్చరికలు. ప్రస్తుతం మనం అనుసరిస్తున్న విధానాలను తక్షణమే మార్చుకోవాల్సి ఉంది. ఇది అన్ని దేశాల సహకారంతోనే సాధ్యమవుతుంది."

-పాట్రిసియా ఎస్పిసోనా, యూఎన్​ఎఫ్​సీసీసీ ఛైర్మన్

2030 కంటే ముందే కార్బన్​ డై ఆక్సైడ్​ ఉద్గారాలను సున్నా శాతానికి పరిమితం చేసి, 2060 నాటికి తటస్థం చేస్తామని చైనా గతేడాది ప్రకటించింది. అయితే.. ఈ లక్ష్యాన్ని ఐక్యరాజ్య సమితికి అధికారికంగా సమర్పించాల్సి ఉంది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.