ETV Bharat / international

కర్బన ఉద్గారాల తగ్గింపుపై ఈయూ కీలక నిర్ణయం

author img

By

Published : Apr 21, 2021, 6:26 PM IST

వాతావరణ మార్పులకు సంబంధించి ఐరోపా యూనియన్ ఓ అంగీకారానికి వచ్చింది. 2050లోగా కర్బన ఉద్గారాలను 55శాతం తగ్గించాలన్న ప్రతిపాదనను ప్రాథమికంగా అంగీకరించింది.

European Union
ఐరోపా యూనియన్​

2050లోగా కర్బన ఉద్గారాలను కనీసం 55శాతం తగ్గించాలన్న ప్రతిపాదనపై ఐరోపా యూనియన్ ప్రాథమికంగా ఏకాభిప్రాయానికి వచ్చింది. వాతావరణ మార్పులపై తర్వలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సదస్సు నిర్వహించనున్న నేపథ్యంలో.. ఈయూ తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

మంగళవారం రాత్రి ఈయూ సభ్యులు చర్చించిన అనంతరం వారు ప్రాథమిక అంగీకారానికి వచ్చారు. 1990తో పోలిస్తే.. 2050నాటికి కర్బన ఉద్గారాల్ని 55శాతం తగ్గించాలన్న ప్రతిపాదనకు ఈయూ కట్టుబడి ఉంది.

"2050వరకల్లా కర్బన ఉద్గారాల్ని తగ్గించాలన్నది మా తొలి ప్రాధాన్యం. మా ఈ నిర్ణయం ఈయూను తరతరాల వరకు గొప్ప స్థానంలో ఉంచుతుంది."

- ఉర్సులా వండెర్ లియెన్, ఈయూ అధ్యక్షుడు

కర్బన ఉద్గారాల్ని అధికంగా విడుదల చేస్తున్న దేశాల్లో చైనా తర్వాతి స్థానం అమెరికాదే. ఈ నేపథ్యంలో.. 2030నాటికి తాము విడుదల చేస్తున్న కర్బన ఉద్గారాల్ని ఎంతమేరకు తగ్గించాలనే ప్రతిపాదనను త్వరలోనే వెల్లడించనుంది బైడెన్​ సర్కార్​.

ఇదీ చదవండి: ఉక్రెయిన్‌పై రష్యా ఉక్రోషం వెనుక కారణమేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.