ETV Bharat / crime

పెళ్లి రోజునే నూరేళ్లు నిండాయి.. పనికోసం వెళ్తే..!

author img

By

Published : May 30, 2022, 7:00 PM IST

పెళ్లి రోజునే నూరేళ్లు నిండాయి.. పనికోసం వెళ్తే..!
పెళ్లి రోజునే నూరేళ్లు నిండాయి.. పనికోసం వెళ్తే..!

పెళ్లి రోజున ఓ జంటను విధి విడదీసింది. పెళ్లి చేసుకుని ఏడాది పూర్తైన సందర్భంగా పెళ్లి వేడుకలు జరుపుకున్న కొద్దిసేపటికే ఓ వ్యక్తిని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో వెంటాడింది. మ్యారేజ్​ డే రోజునే ఈ ప్రమాదం జరగడం ఆ కుటుంబంలో విషాదం నింపింది.

పెళ్లి రోజునే అతనికి నూరేళ్లు నిండాయి. మ్యారేజ్​ డే రోజున ఉదయమే లేచి భార్యతో కలిసి ఆలయానికి వెళ్లాడు. తమను ఎళ్లవేలలా కాపాడు స్వామి అంటూ మొక్కుకున్నాడు. భార్యను గుడి నుంచి తీసుకొచ్చి ఇంటివద్ద దింపాడు. అనంతరం పనినిమిత్తం వెళ్లాలనుకుంటే మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో వెంటాడింది. ఈ హృదయ విదారక ఘటన ఆదిలాబాద్​ జిల్లాలో జరిగింది.

ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం మాండగడలో విషాదఘటన చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన ఉమేశ్‌ అనే వ్యక్తి తన పెళ్లి రోజు కావడంతో భార్యతో గుడికి వెళ్లి ఆమెను ఇంటి వద్ద దింపాడు. ఆ తర్వాత పనినిమిత్తం మహారాష్ట్రకు బైక్‌పై వెళ్తుండగా.. గ్రామసమీపంలోని రహదారిపై వెనక నుంచి వాహనం ఢీకొనడంతో అక్కడిక్కడే చనిపోయాడు. ఏడాది పూర్తయిన సందర్భంగా పెళ్లి వేడుకలు జరుపుకున్న కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరగడం ఆ కుటుంబంలో విషాదం నింపింది. భార్యను గుడికి తీసుకెళ్లేటపుడు హెల్మెట్‌ ధరించిన ఆయన ఊరు వెళ్లేటపుడు హెల్మెట్‌ను ఇంటి వద్ద ఉంచడం.. తలకు గాయాలై చనిపోవడంతో హెల్మెట్‌ ఉంటే ప్రాణాలు నిలిచేవన్న మాట వినిపించింది. పెళ్లి వేడుకలు జరుపుకున్న కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరగడంతో తన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.