కృష్ణానది వద్ద తెలుగురాష్ట్రాల మత్స్యకారుల మధ్య ఘర్షణ

author img

By

Published : May 30, 2022, 6:12 PM IST

Updated : May 30, 2022, 6:30 PM IST

Conflict between Telugu fishermen at Krishna river

18:08 May 30

పరస్పరం రాళ్లు రువ్వుకున్న ఏపీ, తెలంగాణ మత్స్యకారులు

Conflict between Telugu states fishermen: నల్గొండ జిల్లా కృష్ణానది వద్ద తెలుగురాష్ట్రాల మత్స్యకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నాగార్జునసాగర్ బ్యాక్‌వాటర్ ప్రాంతంలోని కృష్ణానది వద్ద ఈ ఘటన జరిగింది.తెలంగాణ, ఏపీ మత్స్యకారులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. రింగ్ వలలు వేయొద్దంటూ నల్గొండ జిల్లా మత్స్యకారులు డిమాండ్‌ చేశారు. అయితే ఏపీ మత్స్యకారులు మొండిగా రింగ్‌ వలలు వేస్తున్నారంటూ ఆందోళన చేపట్టారు. కృష్ణానది వద్ద ఏపీ మత్స్యకారులతో తెలంగాణ మత్స్యకారుల వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తెలంగాణ మత్స్యకారులను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి: 'విరాటపర్వం' విడుదల తేదీ మార్పు.. 'గాడ్సే'కు పోటీగా

Last Updated :May 30, 2022, 6:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.