ETV Bharat / city

Varavara Rao Bail Extended: వరవరరావు బెయిల్​ మరోసారి పొడిగింపు.. ఈసారి ఎప్పటివరకంటే..?

author img

By

Published : Feb 4, 2022, 10:06 PM IST

Varavara Rao Bail Extended: విరసం నేత వరవరరావు బెయిల్​ను బాంబే హైకోర్టు మరోసారి పొడిగించింది. ఆయన అనారోగ్య కారణాల దృష్ట్యా ధర్మాసనం బెయిల్​ గడువును ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది.

virasam leader Varavara Rao Bail Extended to February 28
virasam leader Varavara Rao Bail Extended to February 28

Varavara Rao Bail Extended: మావోయిస్ట్ లింకుల కేసులో లొంగిపోవడానికి విరసం నేత వరవరరావు(83)కు బెయిల్ గడువును బాంబే హైకోర్టు మరోసారి ​ పొడిగించింది. చివరి ఉత్తర్వుల నేపథ్యంలో ఫిబ్రవరి 5న వరవరరావు లొంగిపోవాల్సి ఉండగా.. ధర్మాసనం ముందుకు బెయిల్​ పిటిషన్​ విచారణకు వచ్చింది. జస్టిస్​ ఎస్‌ఎస్‌ షిండే, జస్టిస్​ ఎన్‌ఆర్‌ బోర్కర్‌లతో కూడిన ధర్మాసనం వరవరరావు బెయిల్​ పిటిషన్​లపై అత్యవసర విచారణ చేపట్టింది. వరవరరావు తరఫు న్యాయవాదుల వాదనలు విన్న ధర్మాసనం.. బెయిల్​ గడువును ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది.

బెయిల్​ పొడిగింపుల పర్వం..

ఎల్గార్​ పరిషద్​ కేసులో అరెస్టయిన వరవరరావు ఆరోగ్య కారణాల దృష్ట్యా 2021 ఫిబ్రవరిలో హైకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. సెప్టెంబర్ 5న లొంగిపోవాల్సి ఉండగా.. బెయిల్‌ను పొడిగించాలని కోరుతూ ఒక పిటిషన్‌ను దాఖలు చేశారు. అనారోగ్య కారణాల వల్ల శాశ్వత బెయిల్ కోరుతూ మరొక పిటిషన్​ దాఖలు చేశారు. అప్పటి నుంచి వివిధ కారణాలతో నవీ ముంబైలోని తలోజా జైలు అధికారుల ఎదుట లొంగిపోయేందుకు ఇచ్చిన గడువును హైకోర్టు పొడిగిస్తూ వస్తోంది. ప్రస్తుతం కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం.. మరోసారి బెయిల్​ గడువును పొడిగిస్తూ.. తదుపరి విచారణను ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది.

ఎల్గార్‌ పరిషద్‌ కేసు ఏంటి?

మహారాష్ట్రలోని బీమా-కోరేగావ్‌లో 2018 జనవరిలో జరిగిన అల్లర్లలో మావోయిస్టుల కుట్ర ఉందని పుణెలో పోలీసులు కేసు నమోదు చేశారు. 2017 డిసెంబరు 31న ఎల్గార్‌ పరిషద్‌ అనే సంస్థ పుణెలో నిర్వహించిన కార్యక్రమం వెనుక మావోయిస్టులు ఉన్నారని, ఇక్కడ జరిగిన ప్రసంగాలే మర్నాడు బీమా కోరేగావ్‌ అల్లర్లకు కారణమయ్యాయని పేర్కొన్నారు. దీనికి సంబంధించి 2018 జూన్‌లో దేశవ్యాప్తంగా ఆరుగుర్ని అరెస్టు చేశారు. ఇందులో దిల్లీకి చెందిన పౌరహక్కుల నేతలు రోనా విల్సన్‌, రోనా జాకొబ్‌, దళిత హక్కుల నాయకుడు ఎల్గార్‌ పరిషద్‌కు చెందిన సుధీర్‌ ధవాలె, షోమ సేన్‌, మహేష్‌ రౌత్‌, న్యాయవాది సరేంద్ర గాడ్లింగ్‌ ఉన్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.