ETV Bharat / city

ఎన్ని రెండు పడక గదుల ఇళ్లు నిర్మించారు? ఎన్ని కేటాయించారు?: హైకోర్టు

author img

By

Published : Apr 25, 2022, 2:06 PM IST

Updated : Apr 25, 2022, 6:58 PM IST

TS High Court hearing on petition alleging non-allocation of two-bedroom houses
ఎన్ని రెండు పడక గదుల ఇళ్లు నిర్మించారు? ఎన్ని కేటాయించారు?: హైకోర్టు

14:01 April 25

రెండు పడక గదుల ఇళ్లు కేటాయించట్లేదన్న పిల్‌పై హైకోర్టు విచారణ

TS High Court : రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం, కేటాయింపు స్థితిపై నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. భాజపా నేత నల్లు ఇంద్రసేనారెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సీజే జస్టిస్ సతీష్ చంద్రశర్మ, అభినంద్ కుమార్ షావిలి ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. సుమారు 10వేల కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో లక్ష డబుల్ బెడ్​రూం ఇళ్లు నిర్మించినప్పటికీ.. కేవలం 12వేలు మాత్రమే కేటాయించారని ఇంద్రసేనారెడ్డి తరఫు న్యాయవాది వివరించారు.

ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ.. రాజకీయ కారణాలతో లబ్ధిదారులకు కేటాయించడం లేదన్నారు. లబ్ధిదారులకు ఎందుకు కేటాయించడం లేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కొన్ని ఇళ్ల కేటాయింపు పూర్తయిందని.. మిగతా వాటిని వీలైనంత త్వరగా కేటాయించనున్నట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది వివరించారు. ఇప్పటి వరకు ఎన్ని నిర్మించారు.. లబ్ధిదారులకు ఎన్ని కేటాయించారో పూర్తి వివరాలతో రెండు నెలల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

ఇవీ చదవండి: రెండురోజుల క్రితం గృహ ప్రవేశం- దంపతులు సజీవ దహనం

Revanth Reddy On PK: 'ఆరోజు పీకేనే తెరాసను ఓడించాలని చెబుతారు'

Last Updated :Apr 25, 2022, 6:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.