ETV Bharat / city

'మహిళల భద్రతకే అత్యధిక ప్రాధాన్యత'

author img

By

Published : Jun 6, 2020, 8:31 PM IST

మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని హోం శాఖ మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. గోల్కొండలోని తారామతి, బారాదరిలో 'స్ట్రీ' పేరిట నిర్వహించిన కార్యక్రమంలో హోం మంత్రి పాల్గొన్నారు.

stree-women-empowerment-program-in-golconda-hyderabad
మహిళల భద్రతకే అత్యధిక ప్రాధాన్యత

దేశంలోనే రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతల విషయంలో మొదటిస్థానంలో ఉందని హోం శాఖ మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. సంక్షేమ పథకాల అమలులో కూడా మహిళలకే ప్రభుత్వం ప్రాధాన్యత నిస్తోందన్నారు. గోల్కొండలోని తారామతి, బారాదరిలో స్ట్రీ పేరిట జరిగిన కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులతో కలిసి హోం మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక లోగో హోం మంత్రి ఆవిష్కరించారు.

పోలీసు శాఖలో అనే సవాళ్లు ఎదురవుతాయని.. వాటిని ధీటుగా ఎదుర్కొని అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించాలని పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ సూచించారు. కరోనా వైరస్‌ కట్టడిలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని... ఈ క్రమంలో వారు ఎన్నో త్యాగాలు చేస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం కరోనా వైరస్‌ వ్యాప్తి అరికట్టడానికి పోలీసులు చేస్తున్న కృషికి సంబంధించిన లఘు చిత్రాన్ని హోం మంత్రి ఆవిష్కరించారు.

మహిళల భద్రతకు పోలీసు శాఖ పాటుపడుతుంది. షీ బృందాల తరహాలోనే ' స్ట్రీ' మహిళల భద్రత కోసం పనిచేస్తుంది. ఇందులో పోలీసులతోపాటు స్వచ్ఛంద సంస్థలు, సామాజిక వేత్తలు భాగస్వాములుగా ఉంటారు. వేధింపుల బారిన పడే మహిళలు స్ట్రీ బృందాన్ని సంప్రదిస్తే వారి సమస్యల పరిష్కారానికి మార్గం చూపుతారు. -కమిషనర్‌ అంజనీకుమార్​

మహిళల భద్రతకే అత్యధిక ప్రాధాన్యత

ఇదీ చూడండి: జూన్​ 23న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.