ETV Bharat / city

Sirpurkar Commission Report : దిశ నిందితుల ఎన్​కౌంటర్​.. సజ్జనార్​ పాత్రపై సుప్రీంకు నివేదిక

author img

By

Published : Jan 31, 2022, 12:16 PM IST

Updated : Jan 31, 2022, 3:46 PM IST

Sirpurkar Commission Report
Sirpurkar Commission Report

12:12 January 31

సుప్రీం కోర్టుకు సిర్పూర్కర్ కమిషన్ నివేదిక

Sirpurkar Commission Report : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార కేసులో నిందితుల ఎన్​కౌంటర్​పై విచారణ చేపట్టిన సిర్పూర్కర్ కమిషన్ నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించింది. 47 రోజులపాటు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన కమిషన్.. ఈనెల 28న సుప్రీంకు నివేదిక అందించింది. ఈ కేసుకు సంబంధించి కమిషన్.. అప్పటి సీపీ సజ్జనార్, సిట్ ఛైర్మన్ మహేశ్ భగవత్, శంషాబాద్ డీసీపీతో పాటు పలువురు పోలీసులు అధికారులు, ఎన్​కౌంటర్​లో మృతి చెందిన వారి కుటుంబాలను, ప్రత్యక్ష సాక్షులను, స్థానికులను విచారించింది.

Disha Culprits Encounter : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దిశ హత్యాచార కేసులో నిందితులు పోలీసులపై కాల్పులు జరపడం వల్ల ఎన్​కౌంటర్​ చేసినట్లు అప్పటి సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ కేసుపై రాచకొండ సీపీ ఛైర్మన్​గా సిట్ కూడా ఏర్పాటైంది. అనంతరం 2019 డిసెంబర్ 12న సుప్రీం కోర్టు.. సిర్పూర్కర్ కమిషన్‌ను నియమించింది.

Disha Culprits Encounter Case : 2019 డిసెంబరు 6న... దిశ అత్యాచార నిందితులు నలుగురు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాయారు. ఆ ఎన్‌కౌంటర్‌ జరిగిన విధానంపై నిజనిర్ధారణ చేసేందుకు సిర్పూర్కర్‌ కమిషన్‌ క్షేత్రస్థాయిలో పర్యటించి.. నిందితుల కుటుంబసభ్యులు, ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులు సహా సంబంధిత అధికారులను విచారించింది. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలు పరిశీలించింది. 57 మంది సాక్షులను విచారించినట్లు నివేదికలో పేర్కొంది.

సంబంధిత కథనాలు :

Last Updated :Jan 31, 2022, 3:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.