ETV Bharat / city

దీపావళి ఎఫెక్ట్​.. కంటి గాయాలతో సరోజనిదేవి ఆస్పత్రికి బాధితులు క్యూ

author img

By

Published : Nov 5, 2021, 5:34 AM IST

దీపావళి సందర్భంగా (Diwali celebrations in hyderabad)జరిగిన పలు ప్రమాదాలతో సరోజనిదేవి కంటి ఆస్పత్రి కిటకిటలాడింది. ఇందులో ఇద్దరు చిన్నారులను అడ్మిట్​ చేసుకున్నామని.. మిగిలిన వారికి సత్వర చికిత్స అందించినట్లు వైద్యులు తెలిపారు.

sarojini devi eye hospital
sarojini devi eye hospital

దీపావళీ సందర్భంగా బాణాసంచా కాల్చిన సమయంలో జరిగిన ప్రమాదాల వల్ల గాయపడిన బాధితులతో హైదరాబాద్​లోని సరోజనిదేవి కంటి (Sarojini Devi eye hospital )ఆసుపత్రి కిటకిటలాడింది. పదుల సంఖ్యలో బాధితులు, చిన్నారులు కంటి గాయాలతో ఆస్పత్రి వద్ద క్యూ కట్టారు.

స్వల్పంగా గాయపడిన వారికి చికిత్స చేసి ఇంటికి పంపించగా.. తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నామని ఆస్పత్రి సీనియర్ కంటి వైద్యురాలు డాక్టర్ సునీత అన్నారు. దీపావళి సందర్భంగా బాణాసంచా కాల్చిన సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారులే ఎక్కువగా క్షతగాత్రులవుతున్నారని ఆమె పేర్కొన్నారు. బాణాసంచా ప్రమాదాలతో తీవ్రంగా గాయపడిన వారిని ఉస్మానియా ఆసుపత్రికి పంపించామన్నారు.

'ఉదయం నుంచి సాయంత్రం వరకు బాణాసంచా ప్రమాదాలతో 10 మంది కంటి ఆసుపత్రికి వచ్చారు. ఇద్దరిని అడ్మిట్​ చేసుకున్నాం. మిగిలిన కేసులను ఓపీ బేసీస్​లోనే ట్రీట్​ చేశాం. ఇద్దరు చిన్నారులు అడ్మిట్​ అయ్యారు.'

- డా.సునీత, డీఎంవో.

ఇవీచూడండి: Diwali celebrations in Telangana: ఘనంగా దీపావళి వేడుకలు.. గల్లీగల్లీలో టపాసుల మోతలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.