GHMC imposed fine on BJP and TRS : జాతీయ కార్యవర్గ సమావేశాల పేరుతో భాజపా, విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్సిన్హాకు మద్దతు తెలుపుతూ తెరాస నేతలు హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, కటౌట్లు ఏర్పాటు చేశారు. వీటిపై శనివారం సాయంత్రం వరకూ భాజపా నేతలకు రూ.20 లక్షలు, తెరాస నాయకులకు రూ.3 లక్షల మేర జరిమానాలు విధించినట్లు జీహెచ్ఎంసీకి చెందిన ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్(ఈవీడీఎం) డైరెక్టరేట్ అధికారులు వెల్లడించారు.
భాగ్యనగర వ్యాప్తంగా మెట్రో రైలు స్తంభాలపై రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల ప్రచార ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. ఎల్బీనగర్ పరిధి చైతన్యపురి ప్రాంతంలో ఆయా ఫ్లెక్సీలపై.. సికింద్రాబాద్లో ఆదివారం నిర్వహించనున్న విజయ సంకల్ప సభ ఫ్లెక్సీలను భాజపా నేతలు అతికించడం గమనార్హం.