ETV Bharat / city

రాష్ట్రంలో మరో 114 కరోనా కేసులు, ఒకరు మృతి

author img

By

Published : Feb 22, 2021, 10:10 AM IST

తెలంగాణలో మరో 114 మందికి కరోనా మహమ్మారి సోకింది. వైరస్ బారిన పడి తాజాగా ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,97,712 మంది మహమ్మారి బారిన పడ్డారు.

covid-cases-and-deaths-in-telangana-today
రాష్ట్రంలో మరో 114 కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. మరో 114 మందికి మహమ్మారి సోకగా.. వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందారు. ఇప్పటివరకు తెలంగాణలో 2,97,712 మంది మహమ్మారి బారిన పడగా.. 1625 మంది మృతి చెందారు.

కరోనా నుంచి మరో 143 మంది బాధితులు కోలుకోగా.. వైరస్ బారి నుంచి బయటపడిన వారి సంఖ్య 2,94,386కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,701 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం 645 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 24 కరోనా కేసులు నమోదయ్యాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.