ETV Bharat / city

రైతుల పోరాటానికి మద్దతుగా లండన్​లో కారు ర్యాలీ

author img

By

Published : Dec 8, 2020, 8:36 AM IST

trs nri leaders support Indian farmer's protest
రైతుల పోరాటానికి మద్దతుగా లండన్​లో కారు ర్యాలీ

దిల్లీలో రైతుల పోరాటానికి ప్రతి ఒక్కరు మద్దతివ్వాలని, ఇది కేవలం పంజాబ్​ రైతుల సమస్యే కాదని తెరాస ఎన్నారై వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం అన్నారు. రైతులకు మద్దతుగా లండన్​లో కారు ర్యాలీ చేపట్టారు.

దిల్లీలో రైతుల పోరాటానికి తెరాస ఎన్నారై నాయకులు మద్దతు తెలిపారు. కర్షకులకు సంఘీభావం ప్రకటిస్తూ.. లండన్​లో కారు ర్యాలీ చేపట్టారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని, వాటిని ఉపసంహరించుకోవాలని తెరాస ఎన్నారై వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం డిమాండ్ చేశారు.

ఈ పోరాటం కేవలం పంజాబ్ రైతులది మాత్రమే కాదని, దేశవ్యాప్తంగా కర్షకులు, రవాణా సంఘాలు, చిల్లర వర్తకులు, వ్యవసాయంతో అనుబంధమున్న ప్రతి ఒక్కరిదని అన్నారు. నేటి భారత్​ బంద్​లో ప్రతి ఒక్కరు పాల్గొని రైతులకు అండగా నిలవాలని, బంద్​ను విజయవంతం చేయాలని కోరారు.

రైతుల పోరాటానికి మద్దతుగా లండన్​లో కారు ర్యాలీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.