ETV Bharat / city

పోర్టులో 'అదానీ'కి వాటా.. ఏపీ ప్రభుత్వానికి కోట్ల ఆదాయం

author img

By

Published : May 6, 2021, 9:26 AM IST

గంగవరం పోర్టులో ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వానికి ఉన్న వాటాను కూడా అదానీకి విక్రయించనున్నారు. తద్వారా ఏపీ ప్రభుత్వానికి రూ.645.10 కోట్లు సమకూరనుంది.

gangavaram port news, ap news today
పోర్టులో 'అదానీ'కి వాటా.. ఏపీ ప్రభుత్వానికి కోట్ల ఆదాయం

గంగవరం పోర్టులో ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వానికి ఉన్న 10.4% వాటాను కూడా అదానీకి విక్రయించనున్నారు. మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశం దీనికి ఆమోదముద్ర వేసింది. ఇప్పటికే పోర్టులో 89.6% వాటాను అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌ఈజడ్‌) సొంతం చేసుకున్న విషయం విదితమే.

తాజాగా ప్రభుత్వ వాటా విక్రయంతో ఈ పోర్టు పూర్తిగా అదానీ చేతికి వెళుతుంది. గతంలో విండీ లేక్‌సైడ్‌ నుంచి అదానీ కొనుగోలు చేసిన 31.5% వాటా కింద 16.28 కోట్ల వాటాల బదిలీకి కూడా ఆమోదం లభించింది. పోర్టు వ్యాపార సామర్థ్యం 50 మిలియన్‌ టన్నుల వరకు ఉన్నా.. ఏటా 32-35 మిలియన్‌ టన్నులు మాత్రమే జరుగుతోంది. దీనివల్ల ఏటా రూ.22 కోట్లు డివిడెండ్‌ రూపేణా ఏపీ ప్రభుత్వానికి సమకూరుతుంది.

ఇదీ చదవండి: 14 నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో కరోనా తీరుతెన్నులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.