ETV Bharat / city

ఏపీలో కొత్తగా 19,412 కేసులు.. 61 మరణాలు

author img

By

Published : May 1, 2021, 8:20 PM IST

ఏపీలో కరోనా బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో.. కొత్తగా 19,412 కేసులు నిర్ధరణ కాగా.. 61 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 1,30,752  కరోనా క్రియాశీల కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.

Corona outbreak in AP, AP Corona news, AP News, Corona cases in AP
ఏపీలో కరోనా వ్యాప్తి, ఏపీ కరోనా వార్తలు, ఏపీ న్యూస్, ఏపీలో కరోనా కేసులు

ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కొవిడ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా 98,214 పరీక్షలు నిర్వహించారు. కొత్తగా 19,412 కేసులు నిర్ధరణ కాగా.. 61 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో 11,579 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 1,30,752 కరోనా క్రియాశీల కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.

జిల్లాల వారీగా కేసులు

గడిచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 2,768 కరోనా కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి 2,679, శ్రీకాకుళం 2,048, గుంటూరు 1,750, అనంతపురం 1,862, విశాఖ 1,722, కర్నూలు 1,381, ప్రకాశం 1,106, నెల్లూరు 1,091, పశ్చిమ గోదావరి 1,053, కడప 792, కృష్ణా 694, విజయనగరం జిల్లాలో 606 చొప్పున కేసులు నమోదయ్యాయి. పశ్చిమగోదావరి 842, కడప 757, విజయనగరం 740, కృష్ణా 698, ప్రకాశం 661 చొప్పున కేసులు నమోదయ్యాయి.

జిల్లాల వారీగా మరణాలు

  • గత 24 గంటల వ్యవధిలో అత్యధికంగా విజయనగరం జిల్లాలో 8 మంది మృతి చెందారు. విశాఖ, చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఏడుగురు చొప్పున మరణించారు. అనంతపురంలో ఆరుగురు, ప్రకాశం, కర్నూలు, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందగా.. నెల్లూరులో 4, పశ్చిమ గోదావరిలో ఒకరు, గుంటూరు, కడప, శ్రీకాకుళం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారు.
  • ఇదీ చదవండి: రష్యా నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న స్పుత్నిక్ వి టీకాలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.