ETV Bharat / business

Gold Rate Today : స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

author img

By

Published : Jun 26, 2023, 10:57 AM IST

Gold Rate Today
Gold Rate and silver rates Today

Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లోని బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయో చూద్దామా!

Gold Rate Today : Gold Rate Today : దేశంలో కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి, వెండి ధరలు మళ్లీ పెరగడం మొదలుపెట్టాయి. సోమవారం పది గ్రాముల 24 క్యారెట్​ పసిడి ధర రూ.59,430 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.71,120గా ఉంది.

  • Gold Price in Hyderabad : హైదరాబాద్​లో పది గ్రాముల 24 క్యారెట్​ బంగారం నిన్నటితో పోల్చితే సుమారుగా రూ.160 పెరిగి సోమవారం రూ.60,365 వద్ద కొనసాగుతోంది. మరోవైపు కిలో వెండి ధర గురువారం రూ.70,700గా ఉండగా, రూ.410 పెరిగి బుధవారం రూ.71,125 వద్ద ట్రేడవుతోంది.
  • Gold Price in Vijayawada : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,365గా ఉంది. కిలో వెండి ధర రూ.71,125గా ఉంది.
  • Gold Price in Vishakhapatnam : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,365గా ఉంది. కిలో వెండి ధర రూ.71,125గా ఉంది.
  • Gold Price in Proddatur : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.60,365గా ఉంది. కిలో వెండి ధర రూ.71,125గా ఉంది.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Prices : అంతర్జాతీయంగా పసిడి ధరలు మరింతగా పెరిగాయి. ఆదివారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1916 డాలర్లుగా, సోమవారం నాటికి సుమారు 10 డాలర్లు వృద్ధి చెంది 1925 డాలర్లు వద్ద ట్రేడవుతోంది. మరోవైపు వెండి ధరలు కాస్త స్థిరంగా ఉన్నాయి. ఔన్స్​ వెండి ధర 22.75 డాలర్లుగా ఉంది.

క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency trends today : బిట్​కాయిన్ విలువ రోజురోజుకూ వృద్ధి చెందుతూ ఉంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.24,74,936 వద్ద ట్రేడవుతోంది. కానీ ఇథీరియం, బైనాన్స్ కాయిన్, టెథర్​ మొదలైన క్రిప్టో కరెన్సీ విలువలు మాత్రం కాస్త తగ్గుతున్నాయి. ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ విలువలు ఇలా ఉన్నాయి.

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.24,74,936
ఇథీరియంరూ.1,53,828
టెథర్రూ.81.98
బైనాన్స్ కాయిన్రూ.19,290
యూఎస్​డీ కాయిన్రూ.80.67

స్టాక్​మార్కెట్​ న్యూస్​
Stock market news today : దేశీయ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. గత రెండు సెషన్లలో నష్టాలతో ముగిసిన మార్కెట్లు..బయ్యర్ల కొనుగోలు మద్దతుతో నేడు పుంజుకున్నాయి. కానీ తరువాత మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 63 పాయింట్లు కోల్పోయి 62,915 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 4 పాయింట్లు నష్టపోయి 18,661 పాయింట్లు వద్ద ట్రేడ్​ అవుతోంది.

లాభాల్లో కొనసాగుతున్న షేర్లు : ఎమ్​ అండ్ ఎమ్​, టాటా మోటార్స్​, ఐటీసీ, టైటాన్​, హెచ్​సీఎల్​టెక్​, ఐసీఐసీఐ బ్యాంకు

నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్​లు : టీసీఎస్​, టాటాస్టీల్​, భారతీ ఎయిర్​టెల్​, పవర్​గ్రిడ్​, ఎన్​టీపీసీ, రిలయన్స్​, హెచ్​డీఎఫ్​సీ

రూపాయి విలువ
Rupee open : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ దాదాపు స్థిరంగా ఉంది. సోమవారం రూపాయి మారకపు విలువ డాలర్​తో పోల్చితే రూ.81.95 వద్ద కొనసాగుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol and Diesel Prices : తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు దాదాపు స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.65గా ఉంది. డీజిల్​ ధర రూ.97.80గా ఉంది. వైజాగ్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.25గా ఉంది. దేశ రాజధాని దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.66గా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.