ETV Bharat / business

వరుసగా నాలుగో రోజూ నష్టాలే.. 15 వేల దిగువకు నిఫ్టీ

author img

By

Published : Feb 19, 2021, 3:50 PM IST

వరుసగా నాలుగో రోజూ స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాలు చవిచూశాయి. 434 పాయింట్లు తగ్గిన బీఎస్​ఈ సూచీ సెన్సెక్స్​.. 50,890 వద్ద సెషన్​ను ముగించింది. నిఫ్టీ 15 వేల మార్కు కోల్పోయింది.

stocks today
నేటి స్టాక్​ మార్కెట్లు

స్టాక్​ మార్కెట్లు వరుసగా నాలుగో సెషన్​లోనూ భారీ నష్టాల్లో ముగిశాయి. వారాంతపు సెషన్​లో సెన్సెక్స్ 434 పాయింట్లు తగ్గి 50,890 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 15 వేల మార్కును కోల్పోయింది. 137 పాయింట్లు కోల్పోయి 14 వేల 982 వద్ద ముగిసింది.

బ్యాంకింగ్​ షేర్లు కుదేలయ్యాయి. ఆటో, ఇన్​ఫ్రా, లోహ, ఫార్మా రంగాల షేర్లు.. 1-2 శాతం మేర పడిపోయాయి.

ఆరంభంలో లాభాలతో ప్రారంభమైన స్టాక్​ మార్కెట్లు.. తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. సెన్సెక్స్​ 51,433 పాయింట్ల గరిష్ఠాన్ని.. 50,624 వద్ద కనిష్ఠాన్ని తాకి చివరకు 50,890కి చేరింది.

లాభాల్లోని షేర్లు..

డాక్టర్​ రెడ్డీస్, ఇండస్​ ఇండ్​ బ్యాంకు, హెచ్​యూఎల్​, ఎన్టీపీసీ, రిలయన్స్, టీసీఎస్​ షేర్లు లాభాలను నమోదు చేశాయి.

నష్టాల్లోనివి..

ఓఎన్​జీసీ, ఎస్​బీఐ, యాక్సిస్​ బ్యాంకు, ఐసీఐసీఐ, బజాజ్​ ఆటో​, మారుతీ సుజుకీ షేర్లు నష్టాల్లో ముగిశాయి.

ఇదీ చదవండి: మల్టీ క్యాప్‌..ఫ్లెక్సీ క్యాప్‌..పెట్టుబడికి ఏది మేలు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.