ETV Bharat / business

ఆరంభ లాభాలు ఆవిరి- మూడో రోజూ నష్టాలే

author img

By

Published : Jun 30, 2021, 3:45 PM IST

stoc markets closing on wednesday
స్టాక్​ మార్కెట్లు క్లోసింగ్​

వరుసగా మూడో సెషన్​లోనూ స్టాక్ మార్కెట్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 67 పాయింట్లు తగ్గి 52,400 దిగువకు చేరింది. నిఫ్టీ 27 పాయింట్ల నష్టంతో..15,721 వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్ షేర్లు అధికంగా నష్టపోయాయి.

స్టాక్ మార్కెట్లు బుధవారం కూడా నష్టాలతో ముగిశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 67 పాయింట్ల నష్టంతో 52,482 వద్ద స్థిరపడింది. ఆరంభంలో​ 335 పాయింట్లు పెరిగి 52,878 పాయింట్ల గరిష్ఠాన్ని తాకినా.. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకుంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 27 పాయింట్లు కోల్పోయి 15,721 వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్లు నష్టాలను నమోదు చేయడం వరుసగా ఇది మూడో సెషన్​.

బ్యాంకింగ్​ రంగంలో ఒడుదొడుకుల కారణంగా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయని మార్కెట్​ విశ్లేషకులు చెబుతున్నారు.

లాభాల్లో ఇవే..

ఇన్ఫోసిస్​, రిలయన్స్​, టెక్​మహీంద్ర, మారుతీ, టీసీఎస్​, బజాబ్​ ఆటో, భారతీ ఎయిర్​టెల్​.

నష్టాల్లో ఇవే..

నెస్లే ఇండియా, టైటాన్​, ఇండస్​ఇండ్​ బ్యాంకు, కొటక్​ బ్యాంకు, హెచ్​సీఎల్​ టెక్​.

ఇదీ చూడండి: జులై 1 నుంచి అవి పనిచేయవ్- కొత్త రూల్స్ ఇవే...

ఇదీ చూడండి: Windows-11: సరికొత్త డిజైన్​తో మైక్రోసాఫ్ట్​ చివరి విండోస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.