ETV Bharat / business

వాహనదారులకు పెట్రో వాత.. మళ్లీ పెరిగిన ఇంధన ధరలు

author img

By

Published : Sep 30, 2021, 8:16 AM IST

దేశంలో ఇంధన​ ధరలు (Fuel Price Today) పరుగులు పెడుతున్నాయి. లీటర్​ పెట్రోల్​పై 24 పైసలు.. డీజిల్​పై 30 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు తెలిపాయి.

fuel prices today
పెట్రోల్ ధరల పెంపు

భారత్​లో ఇంధన ధరల పెంపు కొనసాగుతోంది. గురువారం.. దిల్లీలో (Fuel Price Today) లీటర్​ పెట్రోల్​ ధర 24 పైసలు పెరగ్గా.. డీజిల్​పై 30 పైసలు పెరిగింది. ఈ మేరకు చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.101.66కు చేరగా.. డీజిల్​ ధర రూ.89.88కు పెరిగింది.

మెట్రో నగరాల్లో ఇలా..

  • ముంబయిలో లీటర్​ పెట్రోల్​ ధర(Mumbai petrol Price Today) 23 పైసలు ఎగబాకి.. రూ.107.68కు చేరగా.. లీటర్​ డీజిల్​ ధర (Mumbai Diesel Price Today) 32 పైసలు పెరిగి రూ.97.49 వద్ద కొనసాగుతోంది.
  • కోల్​కతాలో లీటర్​ పెట్రోల్​పై(Kolkata petrol Price Today) 29 పైసలు పెరగడం వల్ల ధర రూ.102.15కు పెరిగింది. లీటర్​ డీజిల్​పై (Kolkata Today Diesel Price) 30 పైసలు పెరిగి.. ధర రూ.92.93కు చేరింది.
  • చెన్నైలో లీటర్​ పెట్రోల్​కు(Chennai petrol Price Today) 20 పైసలు ఎగబాకి.. ధర రూ.99.34కు పెరిగింది. లీటర్​ డీజిల్​కు 28 పైసలు (Chennai Diesel Price Today) పెరిగి.. రూ.94.42 వద్ద కొనసాగుతోంది.
  • బెంగళూరులో పెట్రోల్​పై(Bengaluru petrol Price Today) 25 పైసలు పెరిగి.. లీటరు ధర రూ.105.15కు తాకింది. లీటర్​ డీజిల్​పై 31 పైసలు పెరిగి.. ధర రూ.95.34కు పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో..

  • హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్​కు (Petrol Price in Hyderabad)​ ధర 25 పైసలు పెరిగి రూ.105.71 వద్ద కొనసాగుతోంది. లీటర్ డీజిల్​ ధర 32 పైసలు ఎగబాకి.. రూ.98.02కు పెరిగింది.
  • వైజాగ్​లో లీటర్ పెట్రోల్ ధర (Petrol Price in Vizag) 24 పైసలు పెరిగి రూ.106.66కు పెరిగింది. లీటర్​ డీజిల్​ ధర 31 పైసలు పెరిగి రూ.98.47 వద్దకు చేరింది.
  • గుంటూరులో పెట్రోల్​పై 23 పైసలు పెరిగి.. లీటర్​ ధర (Petrol Price in Guntur) రూ.107.92కి పెరిగింది. డీజిల్​ లీటర్​పై 31 పైసలు పెరిగి.. రూ.99.7కు చేరింది.

ఇదీ చూడండి: మరింత పెరగనున్న పెట్రో ధరలు.. ఇవే కారణాలు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.