ETV Bharat / business

'ఆటో పే' కొత్త రూల్స్ అక్టోబర్​ 1 నుంచే- ఈ విషయాలు తెలుసుకోండి..

author img

By

Published : Sep 30, 2021, 1:21 PM IST

Auto pay new rules
ఆటోపే కొత్త రూల్స్​

డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా బిల్లులు, ఇతర చెల్లింపులను ఆటో డెబిట్‌ (Auto pay) ద్వారా చేస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. ఎందుకంటే అక్టోబర్​ 1వ తేదీ నుంచి ఇందుకు సంబంధించిన నిబంధనల్లో ఆర్‌బీఐ (RBI Auto debit new rules) మార్పులు చేపట్టనుంది. కొత్త నిబంధనల గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రస్తుతం డిజిటల్​ పేమెంట్లు సర్వ సాధారణమయ్యాయి. చాలా మంది కరెంట్​ బిల్​, టీవీ బిల్లు, ఓటీటీ సబ్​స్క్రిప్షన్​ బిల్లు, ఇతర ఈఎంఐల వంటి వాటికి.. ఆటో డెబిట్ (Auto pay)​​ సదుపాయం వినియోగించుకుంటున్నారు. ఏదైనా బిల్లు గడువు తేదీ మరిచిపోయినా.. అది సమస్యగా మారకుండా ఈ ఆటో డెబిట్​ సదుపాయం ఎంతగానో (How auto pay works) ఉపయోగపడుతుంది.

అయితే ఇకపై ఆటో డెబిట్​ సదుపాయం వినియోగించుకోవడం అంత సులువు కాదు. ఎందుకంటే.. ఆటో డెబిట్​​ రూల్స్​లో భారీ మార్పులు రానున్నాయి. క్రెడిట్​, డెబిట్​ కార్డుల ద్వారా ఇకపై ఆటో డెబిట్​ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటే.. ఆ పేమెంట్​కు అదనపు ధ్రువీకరణ (ఏఎఫ్‌ఏ) అవసరం. అక్టోబర్​ 1 నుంచే ఈ కొత్త రూల్స్​ అమలులోకి రానున్నాయని ఆర్​బీఐ గతంలోనే స్పష్టం చేసింది.

అక్టోబర్​ 1 నుంచి ఆటో డెబిట్​ ఇలా..

రూ.5000 కంటే ఎక్కువ మొత్తానికి ఆటో డెబిట్​ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటే.. ఓటీపీ అదనపు ధ్రువీకరణ (ఏఎఫ్‌ఏ) అవసరమవుతుంది.

ఆటో డెబిట్​ తేదీకి కొన్ని రోజుల ముందే పేమెంట్​కు సంబంధించిన సమాచారాన్ని వినియోగదారుడికి పంపిస్తాయి బ్యాంకులు.

పేమెంట్​ కొనసాగించాలనుకుంటే.. ఓటీపీతో ఆ పేమెంట్​ను నిర్ధరించాలి. లేదంటే పేమెంట్​ పూర్తవదు. అప్పుడు మాన్యువల్​గా లావాదేవీని పూర్తి చేయాల్సి ఉంటుంది.

అన్ని రకాల క్రెడిట్​, డెబిట్​ కార్డులకు దేశీయ, అంతర్జాతీయ లావాదేవీలకు ఈ రూల్స్​ వర్తిస్తాయి.

2019 నుంచే ప్లాన్​..

నిజానికి ఈ కొత్త విధానాన్ని 2019 ఆగస్టులోనే రూపొందించింది ఆర్​బీఐ. 2021 ఏప్రిల్ నుంచి అమలులోకి (RBI new guidelines for auto debit) తీసుకురావాలని కూడా ప్రయత్నించింది. తొలుత రూ.2 వేలు దాటిన లావాదేవీలకు కొత్త రూల్స్ వర్తింపజేయాలని నిర్ణయించింది. అయితే రిటైల్ బ్యాంకులు చేసిన అభ్యర్థన మేరకు ఈ నిబంధనల అమలును ఆరు నెలలు వాయిదా వేయడం సహా.. పేమెంట్​ కనీస మొత్తాన్ని రూ.5 వేలకు పెంచింది. గడువు తర్వాత ఈ నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కూడా ఆర్​బీఐ స్పష్టం చేసింది.

కొత్త రూల్స్ గురించి ఇప్పటికే పలు రిటైల్ బ్యాంకులు తమ ఖాతాదారులకు సందేశాల రూపంలో సమాచారం ఇస్తున్నాయి. కొత్త రూల్స్​తో వచ్చే మార్పులు, ఆటో డెబిట్​ను ఇకపై ఎలా ఉపయోగించుకోవాలనే వివరాలను కూడా వినియోగదారులకు పంపిస్తున్నాయి.

ఇవీ చదవండి: వాహనదారులకు పెట్రో వాత.. మళ్లీ పెరిగిన ఇంధన ధరలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.