ETV Bharat / business

సీఎంలతో సోమవారం నిర్మల కీలక భేటీ- అజెండా ఇదే...

author img

By

Published : Nov 12, 2021, 4:17 PM IST

nirmala sitaraman
నిర్మలా సీతారామన్

ఈనెల 15న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ సమావేశం కానున్నారు. ప్రైవేటు పెట్టుబడుుల పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ప్రైవేట్​ పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈనెల 15న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్యమంత్రులు, రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో భేటీ కానున్నారు. ఈ విషయాన్ని ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ గురువారం వెల్లడించారు. ఆర్థిక వ్వవస్థ పుంజుకుంటున్న నేపథ్యంలో కేంద్రం ప్రైవేటు పెట్టుబడులపై దృష్టి సారించిందన్నారు.

'పెట్టుబడులకు భారత్​ ప్రధాన కేంద్రంగా మారుతోంది.. ప్రైవెటు రంగం కూడా ఆసక్తి కనబరుస్తోంది' అని సోమనాథన్​ పేర్కొన్నారు.

భూమి, నీటి వినియోగంపై ఉన్న నిబంధనలు సడలించడంపై ఈ భేటీలో ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అజయ్​ సేఠ్​ వెల్లడించారు.

ఇదీ చూడండి : ఆటో సేల్స్​పై 'చిప్'​ దెబ్బ- అక్టోబర్​లో 27% డౌన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.