ETV Bharat / state

జగిత్యాల, రామగుండం, లక్షెట్టిపేటలో స్వల్ప భూప్రకంపనలు

author img

By

Published : Oct 31, 2021, 7:30 PM IST

Updated : Oct 31, 2021, 10:47 PM IST

Minor earthquakes
భూప్రకంపనలు

19:26 October 31

జగిత్యాల, రామగుండం, లక్షెట్టిపేటలో స్వల్ప భూప్రకంపనలు

జగిత్యాల, రామగుండంలో ఇవాళ స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. సాయంత్రం 6.49 గంటల సమయంలో పట్టణంలోని రహమత్ పురలో 4 సెకండ్లపాటు కదిలికలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. జగిత్యాలతో పాటు కొడిమ్యాల మండలం దమ్మయ్యపేటలో రాత్రి ఏడు గంటల 15 నిమిషాలకు భూమిలో శబ్దం రావడం వల్ల ఒక్కసారిగా జనం పరుగులు తీశారు. బీర్పూర్, కోరుట్ల, మెట్​పల్లి, మల్యాల, వెల్గటూర్ తదితర మండలాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోనూ భూమి స్వల్పంగా కంపించింది. గోదావరి పరివాహక గ్రామాల్లో స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. 

ఇదీ చదవండి: DK Aruna: 'ఓటమి భయంతోనే ఈవీఎంలు, వీవీప్యాట్లు మారుద్దామనే ఆలోచన'

Last Updated :Oct 31, 2021, 10:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.