ETV Bharat / bharat

ఆన్​లైన్​లోనే యమునోత్రి దర్శనం

author img

By

Published : May 14, 2021, 8:30 PM IST

అక్షయ తృతీయను పురస్కరించుకుని చార్​ధామ్​ ఆలయాల్లో ఒకటైన యమునోత్రి ఆలయం తెరచుకుంది. అయితే కరోనా రెండో దశ వ్యాప్తి దృష్ట్యా ఈ ఏడాది సైతం ఆన్​లైన్​ పోర్టల్ ద్వారానే భక్తులకు పూజలు అందించనున్నారు. అలాగే మిగతా మూడు ఆలయాలు గంగోత్రి శనివారం(మే 15న), కేదార్‌నాథ్ మే 17న, బద్రీనాథ్ ఆలయం మే 18న తెరుచుకోనున్నాయి.

yamunotri-dham-doors-opened
తెరచుకున్న యమునోత్రి ఆలయం.. భక్తులకు నో ఎంట్రీ

హిందువులు పవిత్రంగా భావించే 'చార్​ధామ్'​ ఆలయాలు అక్షయ తృతీయ సందర్భంగా తెరుచుకున్నాయి. ఈ మేరకు ఉత్తరాఖండ్​లోని యమునోత్రి ఆలయం ఆన్​లైన్​ పోర్టల్​ శుక్రవారం ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో అతి తక్కువ మంది పూజారులు, అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భక్తులకు ప్రవేశాన్ని నిరాకరించారు.

అక్షయ తృతీయ సందర్భంగా మధ్యాహ్నం 12.15 గంటలకు పూజారులు, అధికారులతో సహా.. 25 మంది సమక్షంలో ఈ ఆలయ ద్వారాలు తెరిచినట్లు యమునోత్రి ఆలయ తీర్థ్ పురోహిత్ పవన్ ఉనియల్ తెలిపారు. మొదటి పూజను ప్రధాని నరేంద్ర మోదీ తరఫున నిర్వహించారు పూజారులు.

yamunotri-dham-doors-opened
అతి తక్కువ మందితో నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాలు
yamunotri-dham-doors-opened
ఆలయం వెలుపల భక్తులు లేక ఇలా..

శీతాకాలంలో ఆరునెలల పాటు మూసి ఉండే చార్​ధామ్ ఆలయాలు భక్తుల సందర్శనార్థం వేసవికాలంలో తెరుచుకుంటాయి. అయితే కరోనా కారణంగా గతేడాది నుంచి ఆన్​లైన్​ పోర్టల్స్​ ద్వారా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

yamunotri-dham-doors-opened
పూజారులకు స్క్రీనింగ్ టెస్ట్
yamunotri-dham-doors-opened
యమునోత్రి ఆలయం లోపలి దృశ్యాలు

ఇక చార్​ధామ్ దేవాలయాల్లో భాగమైన ​గంగోత్రి పోర్టల్​ మే 15(శనివారం) ఉదయం 7 గంటల 31 నిమిషాలకు ప్రారంభం కానుండగా.. కేదార్​నాథ్​ మే 17న, బద్రీనాథ్ ఆలయం మే 18న తెరుచుకోనున్నాయి.

ఇవీ చదవండి: నేటి నుంచే చార్​ధామ్ యాత్ర.. భక్తులకు నో ఎంట్రీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.