ETV Bharat / bharat

బాయ్​ఫ్రెండ్ కళ్ల ముందే యువతిపై గ్యాంగ్​రేప్

author img

By

Published : Mar 29, 2022, 5:13 PM IST

Updated : Mar 29, 2022, 8:53 PM IST

Woman Raped In Tamilnadu
బాయ్​ఫ్రెండ్ ఎదుటే యువతిపై గ్యాంగ్​రేప్

Woman Raped In Tamilnadu: బాయ్​ఫ్రెండ్​ కళ్లముందే యువతిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఎవరికీ చెప్పొద్దని బెదిరించారు. అనంతరం యువతి బాయ్​ఫ్రెండ్ సెల్​ఫోన్ లాక్కుని పరారయ్యారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

Woman Raped In Tamilnadu: తమిళనాడులోని కడలూరులో బాయ్​ఫ్రెండ్ కళ్లముందే యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. అనంతరం యువతి బాయ్​ఫ్రెండ్ సెల్​ఫోన్​ తీసుకుని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. ముగ్గురు నిందితులను అరెస్ట్​ చేశారు.

ఏమైందంటే..: కడలూరులోని కమ్మియమ్​పెట్టాయ్​లో బాధిత యువతి.. తన బాయ్​ఫ్రెండ్​తో నిర్మానుష్య ప్రాంతంలో ఉండగా.. అక్కడకు వచ్చిన ముగ్గురు యువకులు వారిని ఫొటోలు, వీడియోలు తీసి బెదిరించారు. అలా బాయ్​ఫ్రెండ్ ఎదుటే యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాక యువతి బాయ్​ఫ్రెండ్ సెల్​ఫోన్​ను లాక్కున్నారు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించి అక్కడి నుంచి పరారయ్యారు.

కమ్మియమ్​పెట్టాయ్​లో మార్చి 28న రాత్రిపూట గస్తీ నిర్వహించిన పోలీసులు.. యువతి బస్​స్టాప్​లో ఒంటరిగా ఉండటాన్ని గమనించి ప్రశ్నించగా.. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వెంటనే బాధితురాలిని చికిత్స నిమిత్తం కడలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత గాలింపు చర్యలు చేపట్టి ముగ్గురు నిందితులు కిశోర్(19), సతీశ్(19), ఆరిఫ్​(18)ను అరెస్ట్ చేశారు. నిందితుల మొబైల్​ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. డీఐజీ పాండియన్, కడలూరు డీఎస్పీ శక్తి గణేశ్.. ముగ్గురు యువకులను విచారిస్తున్నారు.

డేటింగ్ యాప్​లో పరిచయమై..

బంగాల్​కు చెందిన ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దిల్లీకి చెందిన నలుగురు యువకులు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. దిల్లీకి చెందిన నలుగురు యువకులు రజత్​, శివరామన్, దేవ్ సరోయ్,యోగేశ్​కుమార్​.. జాతీయ స్విమ్మింగ్ పోటీల​ శిక్షణ కోసం బెంగళూరు వచ్చారు. ఈ క్రమంలో రజత్​కు డేటింగ్ యాప్​లో ఓ యువతి పరిచయమైంది. ఆ తర్వాత వారంతా ఫ్రెండ్స్ అయ్యారు. ఈనెల 24 స్నేహితులంతా కలిసి పార్టీ చేసుకున్నారు. అర్ధరాత్రి కావడం వల్ల ఆ యువతి రజత్ గదిలోనే నిద్రపోయింది. ఈక్రమంలో ఆమెపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు.

ఇదీ చూడండి: 45 వెడ్స్ 25.. ఐదు నెలల క్రితం వైరల్.. ఇప్పుడు విషాదం.. పాపం ఆ అమ్మాయి...

Last Updated :Mar 29, 2022, 8:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.