ETV Bharat / bharat

45 వెడ్స్ 25.. ఐదు నెలల క్రితం వైరల్.. ఇప్పుడు విషాదం.. పాపం ఆ అమ్మాయి...

author img

By

Published : Mar 29, 2022, 2:25 PM IST

Karnataka Viral bridegroom Sucide: ఇరవై ఐదేళ్ల అమ్మాయిని పెళ్లిచేసుకుని అప్పట్లో సంచలనంగా మారిన 45 ఏళ్ల వ్యక్తి కుటుంబ సమస్యలతో అత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కర్ణాటక తుమకూరు జిల్లాలోని అక్కిమరిపాళ్య గ్రామంలో జరిగింది.

Karnataka bridegroom's wedding viral on social media committed suicide
వైరల్​ అయిన కర్ణాటక పెళ్లికొడుకు ఆత్మహత్య

Karnataka Viral bridegroom Sucide: ఇరవై ఐదేళ్ల యువతిని వివాహం చేసుకుని అప్పట్లో వైరల్​ అయిన 45ఏళ్ల వ్యక్తి.. కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కర్ణాటక తుమకూరు జిల్లాలోని అక్కిమరిపాళ్య గ్రామంలో జరిగింది. శంకరప్పకు 45 ఏళ్లు వచ్చేవరకు వివాహం జరగలేదు. ఈ విషయం తెలుసుకున్న మేఘన(25).. అతడ్ని ప్రేమించింది. అయితే.. మేఘనకు కూడా అప్పటికే వివాహం అయింది. ఆమె భర్త రెండేళ్ల క్రితం అదృశ్యమయ్యాడు. దీంతో శంకరయ్య అంగీకరించి మేఘనను 2021 అక్టోబర్​లో గుడిలో వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్లి వార్త అప్పట్లో వైరల్​ అయింది.

Karnataka bridegroom's wedding viral on social media committed suicide
మేఘన-శంకరప్ప

పెళ్లైన తర్వాత మేఘన.. తన అత్తగారితో నిరంతరం గొడవపడేది. శంకరయ్యకు చెందిన రూ.2.5కోట్ల భూమిని అమ్మేయాలని ఇటీవల ఇంట్లో ఒత్తిడి తెచ్చింది. ఇందుకు శంకరయ్య అమ్మ అంగీకరించలేదు. తరచూ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో శంకరయ్య విసిగిపోయాడు. పొలంలో చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Karnataka bridegroom's wedding viral on social media committed suicide
మేఘన-శంకరప్ప

ఇదీ చదవండి: ఐఏఎస్​ టాపర్​కు మళ్లీ పెళ్లి.. సీనియర్​ అధికారితో...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.