ETV Bharat / bharat

ట్రాన్స్​ఫార్మర్​ను ఎత్తుకెళ్లిన దొంగలు.. ఐదు గ్రామాలకు కరెంట్ కట్​

author img

By

Published : Dec 12, 2022, 7:25 PM IST

దొంగలు విద్యుత్ ట్రాన్స్​ఫార్మర్​ను ఎత్తుకెళ్లారు. దీంతో ఐదు గ్రామాలకు విద్యుత్​ సౌకర్యం లేకుండా పోయింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

Transformer theft in five villages of Siwan
Transformer theft in five villages of Siwan

బంగారం, నగదు, విలువైన వస్తువులు దొంగతనం చేశారని మనం వినే ఉంటాం. కానీ బిహార్​లో దొంగలు మాత్రం వెరైటీగా విద్యుత్ ట్రాన్స్​ఫార్మర్​ను ఎత్తుకెళ్లారు. దీంతో ఐదు గ్రామాలు పూర్తిగా అంధకారంలో చిక్కుకుపోయింది.
సివాన్​ జిల్లాలోని రఘునాథపుర్ పోలీస్ స్టేషన్​ పరిధిలో ఆదివారం విచిత్ర ఘటన జరిగింది. సుమారు 5 గ్రామాలకు విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్​ఫార్మర్​ను ఎత్తుకెళ్లారు దొంగలు. గ్రామస్థులు ఉదయాన్నే లేచేసరికి గ్రామంలో ఉన్న ట్రాన్స్​ఫార్మర్లు మాయమైపోయాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో విద్యుత్ ట్రాన్స్​ఫార్మర్​ను ఎత్తుకెళ్లడం వల్ల గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో నేరాలకు పాల్పడేందుకు వీలుగానే విద్యుత్​ ట్రాన్స్​ఫార్మర్​ను ఎత్తుకెళ్లి ఉంటారని భావిస్తున్నారు.

"ఐదు గ్రామాలకు విద్యుత్​ సరఫరా చేసే ట్రాన్స్​ఫార్మర్​ను దొంగలు ఎత్తుకెళ్లారు. రఘనాథపుర్​, బజా, పంజ్వర్​, అమ్వారీ, మౌరాపత్తి గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఘటనా స్థలంలో ఓ మోటార్​ సైకిల్​ లభ్యమైంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం."

అమిత్ మౌర్య, జేఈ రఘునాథపుర్​

Transformer theft in five villages of Siwan
ఘటనా స్థలంలో గ్రామస్థులు

ఇవీ చదవండి: ర్యాగింగ్‌పై సినీఫక్కీలో 'పోలీస్‌ పంచ్'.. 'మెడికల్​ స్టూడెంట్'​లా లేడీ పోలీస్​ గెటప్​

పెళ్లిలో భోజనం ప్లేట్​ తాకాడని దళితుడిపై దాడి.. కుటుంబసభ్యులనూ చితకబాది..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.