ETV Bharat / bharat

'అత్యాశపరులే పార్టీ వీడుతున్నారు- ఓటమి తప్పదు'

author img

By

Published : Feb 4, 2021, 6:42 AM IST

పార్టీని వీడుతున్న పార్టీ నాయకులపై తీవ్రంగా స్పందించారు తృణమూల్​ అధినేత్రి, బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. వారు అవినీతి నాయకులని ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వారికి ఓటమి తప్పదని హెచ్చరించారు.

పశ్చిమ్​ బంగాలో తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి భాజపాకు వలస వెళ్లిన నాయకులపై ఆ పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. అత్యాశపరులు మాత్రమే పార్టీని వీడుతున్నారని.. వీరందరికీ రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదని హెచ్చరించారు.

ఎన్నికల తర్వాత వారి దుకాణాలు మూసుకోవాలని మమతా జోస్యం చెప్పారు. కొందరు అవినీతి నాయకులను మాత్రమే.. భాజపా కొనగలదని, నిబద్ధతతో ఉండే పార్టీ కేడర్‌ను ఎన్నటికీ కొనలేదన్నారు. తృణమూల్‌ని వీడి భాజపాలో చేరిన మాజీ మంత్రి హయాంలో జరిగిన అవినీతిపైనా దర్యాప్తు జరిపిస్తామని ఆమె అన్నారు.

ఇదీ చూడండి: గద్దె దింపేస్తాం: రైతు సంఘాల హెచ్చరిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.