ETV Bharat / bharat

అర్ధరాత్రి ఇంట్లో చెలరేగిన మంటలు.. ఒకే కుటుంబంలో ఐదుగురు సజీవ దహనం

author img

By

Published : Dec 28, 2022, 6:32 AM IST

Updated : Dec 28, 2022, 11:32 AM IST

fire breaks out in uttar pradesh
అగ్ని ప్రమాదం

ఉత్తర్​ప్రదేశ్​లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మౌ జిల్లాలోని ఓ ఇంట్లో మంటలు చెలరేగి.. ఒకే కుటుంబానికి చెందిన ఐదురుగు సజీవదహనమయ్యారు.

ఉత్తర్ ​ప్రదేశ్​లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మౌ జిల్లాలోని ఓ ఇంట్లో మంటలు చెలరేగి.. ఒకే కుటుంబానికి చెందిన ఐదురుగు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన షాపుర్​ గ్రామంలో మంగళవారం రాత్రి జరిగినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ఓ మహిళ, పురుషుడితో పాటుగా.. ముగ్గురు మైనర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో ఇల్లు కూడా పూర్తిగా ధ్వంసమైంది.

వెంటనే సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో గ్యాస్​ స్టవ్​ నుంచి మంటలు చెలరేగడమే ఇందుకు కారణమని.. అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దీనిపై పుర్తి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Last Updated :Dec 28, 2022, 11:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.