ETV Bharat / bharat

చేపల విక్రయం తెచ్చిన తంటా.. పెట్రోల్ బాంబులతో రెండు గ్రూపుల దాడి

author img

By

Published : May 17, 2022, 11:24 PM IST

Rivalry over sale of fish leads to violence in TN village
Rivalry over sale of fish leads to violence in TN village

Rivalry over sale of fish: చేపల విక్రయంపై పోటీ ఆ గ్రామంలో హింసకు దారితీసింది. ఉదయం ఘర్షణ పడిన రెండు గ్రూపులు.. సోమవారం అర్ధరాత్రి పదునైన ఆయుధాలు, పెట్రోల్​ బాంబులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు.

Rivalry over sale of fish leads to violence in TN village

Rivalry Over Sale Fish: చేపల విక్రయంపై రెండు గ్రూపుల మధ్య ఘర్షణ.. తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటన తమిళనాడులోని డిండిగుల్​ జిల్లాలో జరిగింది. ఇరు వర్గాల ప్రజలు పదునైన ఆయుధాలతో దాడి చేసుకున్నారు. ఇళ్లపై పెట్రోల్​ బాంబులు విసురుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు.
"సోమవారం ఉదయం చేపలు అమ్మే సమయంలో జరిగిన ఘర్షణ ఈ హింసకు కారణం. అదే రోజు అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. పెట్రోల్ బాంబులు విసిరడం వల్ల ఐదు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. పరిసరాల్లో పార్క్ చేసిన వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. హింసకు పాల్పడిన వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం" అని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి: వైన్స్​ షాప్​పై ఉగ్రవాదుల 'గ్రనేడ్​' దాడి.. ఒకరు మృతి

రోగి కంటిని కొరికిన ఎలుక.. కుటుంబ సభ్యులదే బాధ్యత అని వైద్యుడి వాదన!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.