ETV Bharat / bharat

వైన్స్​ షాప్​పై ఉగ్రవాదుల 'గ్రనేడ్​' దాడి.. ఒకరు మృతి

author img

By

Published : May 17, 2022, 10:01 PM IST

Militants Attacked Wine Shop: ఉత్తర కశ్మీర్‌ బారాముల్లా జిల్లాలోని ఓ మద్యం దుకాణంపై ఉగ్రవాదులు గ్రనేడ్ విసిరారు. ఈ దాడిలో నలుగురు వ్యక్తులు గాయపడగా, ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు.

Militants attacked a wine shop in Baramulla
Militants attacked a wine shop in Baramulla

Militants Attacked Wine Shop: ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా దివాన్‌బాగ్‌లోని మద్యం దుకాణంపై మంగళవారం రాత్రి 8.30 గంటలకు గుర్తు తెలియని దుండగులు గ్రనేడ్​తో దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. తాజా సమాచారం ప్రకారం ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఈ ఘటన తర్వాత.. జమ్ము కశ్మీర్ పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. దాడి చేసిన వారిని పట్టుకోవడానికి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవీ చదవండి: చేయని నేరానికి 12 ఏళ్లుగా జైల్లో.. నిర్దోషిగా తేల్చిన కోర్టు

జ్ఞాన్​వాపి కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. సర్వే నివేదిక ఆలస్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.