ETV Bharat / bharat

చేయని నేరానికి 12 ఏళ్లుగా జైల్లో.. నిర్దోషిగా తేల్చిన కోర్టు

author img

By

Published : May 17, 2022, 8:30 PM IST

Accused Released After 12 Years:
Accused Released After 12 Years:

Accused Released After 12 Years: చేయని నేరానికి 12 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు ఓ వ్యక్తి. దళిత మహిళపై హత్యాచారం చేశాడనే ఆరోపణలతో జైలుకెళ్లిన వ్యక్తిని.. తాజాగా నిర్దోషిగా తేల్చింది న్యాయస్థానం.

Accused Released After 12 Years: దేశ న్యాయవ్యవస్థలో లోపం, పోలీసుల వైఫల్యాన్ని ఎత్తిచూపే మరో ఘటన ఉత్తరప్రదేశ్​లోని బాందాలో​ జరిగింది. చేయని నేరానికి జైలుకెళ్లిన నిందితుడు.. తన జీవితంలో విలువైన సమయాన్ని కారాగారంలోనే గడిపాడు. హత్యాచార ఆరోపణలపై కటకటాల వెనక జీవితం గడిపిన మహమ్మద్​ కమ్రుజామా ఖాన్​ అనే వ్యక్తిని.. 12 ఏళ్ల తర్వాత నిర్దోషిగా తేల్చింది న్యాయస్థానం. అతడు దోషి అని నిరూపించేలా పోలీసులు తగిన సాక్ష్యాధారాలు సమర్పించలేకపోయారు.

అసలేమైందంటే..? 2010 జులై 28న.. ఉత్తరప్రదేశ్​లోని బాందా ప్రాంతంలో ఓ దళిత మహిళపై హత్యాచారం జరిగింది. ఆ తర్వాత రోజు.. బాబేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పొలంలో బాధితురాలి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన తర్వాత బాధితురాలి భర్త అత్యాచారం, హత్య కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా సింగ్‌ను అనుమానిస్తూ అరెస్టు చేసి అదే సంవత్సరం జైలుకు పంపారు పోలీసులు. 12 ఏళ్ల తర్వాత సింగ్​ నిర్దోషిగా తేలాడు.

ఇవీ చదవండి: అస్థికలు కలిపివస్తుండగా విషాదం.. ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి

వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టిన బైక్​.. 30 అడుగులు ఎగిరిపడి అక్కడిక్కడే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.