ETV Bharat / bharat

మత్తుమందు ఇచ్చి.. మర్మాంగాన్ని కోసేసింది..

author img

By

Published : Nov 20, 2021, 8:41 AM IST

Updated : Nov 20, 2021, 8:53 AM IST

chopped off
ప్రైవేటు భాగాలు కట్

ఓ మహిళా యోగా టీచర్ తన సహోద్యోగితో దారుణంగా ప్రవర్తించింది. తోటి యోగా గురువు ప్రైవేటు భాగాలను కోసేసింది. అనంతరం కనిపించకుండా పోయిన మహిళ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు పోలీసులు.

రాజస్థాన్​​ జైపుర్​లో సంచలన ఘటన వెలుగుచూసింది. ఓ మహిళా యోగా టీచర్ తన సహోద్యోగి మర్మాంగాలను కోసేసింది. నవంబర్ 16వ తేదీ రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

ఎందుకు ఇలా చేసిందో?

యోగా టీచర్​గా పనిచేస్తున్న ఆ మహిళ తన తోటి యోగా గురువుకు మత్తు మందు ఇచ్చింది. తర్వాత అతని ప్రైవేట్ భాగాలను కత్తితో కోసేసింది. రక్తపు మడుగులో పడి ఉన్న ఆ వ్యక్తి స్పృహలోకి వచ్చేసరికి ఆ మహిళ కనిపించకుండా పోయిందని బాధితుడు తెలిపాడు. వెంటనే తన స్నేహితురాలికి ఫోన్ చేసి.. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్లు వివరించాడు. డిశ్చార్జి అయిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వాపోయాడు.

ఈ ఘటనపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె అలా ఎందుకు అలా చేసింది? అసలు ఆ రోజు ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు భంక్రోటా ఎస్‌హెచ్‌ఓ ఆర్‌పీ సింగ్ తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated :Nov 20, 2021, 8:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.