ETV Bharat / bharat

నేటి నుంచే చార్​ధామ్ యాత్ర.. భక్తులకు నో ఎంట్రీ

author img

By

Published : May 14, 2021, 5:14 AM IST

Updated : May 14, 2021, 6:19 AM IST

చార్​ధామ్​ యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. కరోనా దృష్ట్యా భక్తులకు అనుమతి కల్పించడం లేదు. యమునోత్రి, గంగోత్రి పోర్టల్​లు శుక్రవారం,శనివారం ప్రారంభం కానున్నాయి.

Chardham Yatra
చార్​ధామ్ యాత్ర

పవిత్ర చార్​ధామ్​ ఆలయాలు అక్షయ తృతీయ సందర్భంగా నేటి నుంచి తెరుచుకోనున్నాయి. అయితే కరోనా రెండో దశ వ్యాప్తి దృష్ట్యా ఈ ఏడాది కూడా భక్తులను దర్శనానికి అనుమతించడం లేదు. అక్షయ తృతీయ సందర్భంగా నేడు యమునోత్రి ధామ్ పోర్టల్​ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. గంగోత్రి పోర్టల్​ శనివారం ఉదయం 7 గంటల 31 నిమిషాలకు ప్రారంభించనున్నారు అధికారులు. కేదార్​నాథ్​ ఆలయం మే 17న, బద్రీనాథ్ ఆలయం మే 18న తెరుచుకోనున్నాయి.

ఆలయ పూజాధికాలకు సంబంధించిన ముఖ్యులు, అధికారులు కలిపి 25 మంది కంటే తక్కువగానే ఆలయాలకు హాజరుకానున్నారు.

ఇదీ చదవండి : '18 ఏళ్లు నిండితే వ్యాక్సిన్‌'..అని కేంద్రం చెప్పినా..!

Last Updated :May 14, 2021, 6:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.