పవిత్ర చార్ధామ్ ఆలయాలు అక్షయ తృతీయ సందర్భంగా నేటి నుంచి తెరుచుకోనున్నాయి. అయితే కరోనా రెండో దశ వ్యాప్తి దృష్ట్యా ఈ ఏడాది కూడా భక్తులను దర్శనానికి అనుమతించడం లేదు. అక్షయ తృతీయ సందర్భంగా నేడు యమునోత్రి ధామ్ పోర్టల్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. గంగోత్రి పోర్టల్ శనివారం ఉదయం 7 గంటల 31 నిమిషాలకు ప్రారంభించనున్నారు అధికారులు. కేదార్నాథ్ ఆలయం మే 17న, బద్రీనాథ్ ఆలయం మే 18న తెరుచుకోనున్నాయి.
ఆలయ పూజాధికాలకు సంబంధించిన ముఖ్యులు, అధికారులు కలిపి 25 మంది కంటే తక్కువగానే ఆలయాలకు హాజరుకానున్నారు.
ఇదీ చదవండి : '18 ఏళ్లు నిండితే వ్యాక్సిన్'..అని కేంద్రం చెప్పినా..!