ETV Bharat / bharat

'మోదీ వల్ల ఈశాన్యాన అభివృద్ధి వరద'

author img

By

Published : Dec 27, 2020, 3:39 PM IST

ప్రధాని నరేంద్రమోదీ హృదయంలో ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక స్థానముందని తెలిపారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అందుకే ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులు వరద ప్రవాహంలా కొనసాగుతున్నాయన్నారు. ఈశాన్యంలో మూడో రోజు పర్యటనలో భాగంగా మణిపుర్​లో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.

PM Modi has brought flood of development in NE: Amit Shah
'మోదీ హృదయంలో ఈశాన్య ప్రాంతాలకు ప్రత్యేక స్థానం'

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భాజపా హయాంలో ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా అన్నారు. మోదీ హృదయంలో ఈశాన్య ప్రాంతాలకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. అందుకే అభివద్ధి ప్రాజెక్టులు వరద ప్రవాహంలా వస్తున్నాయన్నారు.

ఈశాన్య రాష్ట్రాల్లో మూడో, చివరి రోజు పర్యటనలో భాగంగా మణిపుర్​కు ఆదివారం వెళ్లారు అమిత్ షా. హప్తా కాంగ్​జీబంగ్​లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మోదీ ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాలకు సరికొత్త గుర్తింపు తీసుకొచ్చిందన్నారు. ఒకప్పుడు మణిపుర్​ అంటే తిరుగుబాటు, బంద్​లు, దిగ్బంధాలకు కేంద్రం అనే వారని, కానీ భాజపా హయాంలో పరిస్థితి మారిందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం అభివృద్దికి నోచుకోలేదని విమర్శలు గుప్పించారు షా. ఇప్పుడు బీరెన్​ సింగ్​ మూడేళ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారని కితాబిచ్చారు.

ఇన్నర్​ లైన్ పర్మిట్ (ఐఎల్​పీ)ను మణిపుర్​ ప్రజలకు ప్రధాని మోదీ అతిపెద్ద కానుకగా ఇచ్చారని షా అన్నారు. ప్రజలు అడగముందే దీని ఆవశ్యకతను మోదీ గుర్తించారని తెలిపారు.

ఇదీ చూడండి: ఝార్ఖండ్​లో ఐదుగురు నక్సల్స్​ అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.