ETV Bharat / bharat

డ్రీమ్​ 11కు లైన్ క్లియర్- కొత్త చట్టాన్ని కొట్టేసిన హైకోర్ట్

author img

By

Published : Feb 14, 2022, 3:38 PM IST

Karnataka High Court
కర్ణాటక హైకోర్టు

Online Gaming Karnataka High Court: ఆన్​లైన్ గేమింగ్​కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది. బెట్టింగ్​, ఆన్​లైన్ గేమింగ్​, ఆన్​లైన్ గ్యాంబ్లింగ్​లను నిషేధిస్తూ కర్ణాటక సర్కార్ తీసుకొచ్చిన నిబంధనలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది.

Online Gaming Karnataka High Court: ఆన్​లైన్ గేమింగ్​ను నిషేధిస్తూ.. కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రీతురాజ్ అశ్వతి, జస్టిస్ క్రిష్ణ ఎస్. దీక్షిత్​తో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది.

ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆల్​ఇండియా గేమింగ్ ఫెడరేషన్ ఆఫ్​ ఇండియా, గెలాక్టస్ ఫన్​వేర్​ టెక్నాలజీస్​, ఇతర గేమింగ్ సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. వారి పిటిషన్లను విచారించిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

సవరిస్తే అభ్యంతరం లేదు..

"ఆన్​లైన్​ గేమింగ్​కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం రాజ్యాంగ విరుద్ధంగా ఉంది. ఒకవేళ చట్టాన్ని సవరించి రాజ్యంగ పరిధిలో నిబంధనలను రూపొందిస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు." అని ధర్మాసనం స్పష్టం చేసింది.

బెట్టింగ్​, ఆన్​లైన్ గేమింగ్​, ఆన్​లైన్ గ్యాంబ్లింగ్​ నేరపూరితమైనవని, వాటిని నిషేధిస్తూ కర్ణాటక ప్రభుత్వం గతేడాది ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలను పోలీస్(సవరణ) చట్టం, 2021లో పొందుపరిచింది. సైబర్ నేరాలకు సంబంధించి రాష్ట్రప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు అందుతున్న క్రమంలో ఈ నిబంధనలు తెస్తున్నట్లు అప్పట్లో తెలిపింది కర్ణాటక సర్కార్.

ఈ బిల్లు ఆమోదం పొందాక.. మొబైల్ ప్రీమియర్ లీగ్, డ్రీమ్ 11, గేమ్స్ 24x7 వంటి ఆన్​లైన్​ గేమింగ్ ప్లాట్​ఫామ్స్​ నిషేధానికి గురయ్యాయి.

ఇదీ చూడండి: chinese apps ban: 54 చైనా యాప్​లపై నిషేధం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.