ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ఇద్దరు ముష్కరులు హతం

author img

By

Published : Nov 15, 2021, 9:50 PM IST

Updated : Nov 17, 2021, 1:16 PM IST

encounter
ఎన్​కౌంటర్​

జమ్ముకశ్మీర్​ బుద్గాంలోని హైదర్​పొరాలో జరిగిన ఎన్​కౌంటర్​లో (encounter in kashmir) ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

జమ్ముకశ్మీర్‌లోని హైదర్‌పొరా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో (encounter in kashmir) భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. బలగాలు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా.. ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వీటిని తిప్పికొట్టిన బలగాలు తిరిగి కాల్పులు జరపగా, ఇద్దరు ముష్కరులు హతమయ్యారు.

వీరికి సంబంధించిన వివరాలపై భద్రతా సిబ్బంది ఆరా తీస్తున్నారు. ఎన్‌కౌంటర్‌ తర్వాత హైదర్‌పొరా ప్రాంతంలో భద్రతను మరింత పటిష్టం చేశారు.

అలాగే కాల్పులో ఓ పౌరుడు కూడా చనిపోయాడు. అతడు ఓల్డ్ బర్జుల్లా ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త మహ్మద్ అల్తాఫ్ భట్ (44)గా పోలీసులు గుర్తించారు.

ఇదీ చూడండి: 'విశాఖ నుంచి అమెజాన్​ ద్వారా 1000కిలోల గంజాయి స్మగ్లింగ్​'

Last Updated :Nov 17, 2021, 1:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.