ETV Bharat / bharat

వేగంగా ట్రాక్​ పునరుద్ధరణ పనులు.. రాత్రంతా అక్కడే ఉన్న రైల్వే మంత్రి

author img

By

Published : Jun 4, 2023, 7:25 AM IST

Updated : Jun 4, 2023, 2:03 PM IST

Odisha Train Accident Restoration : ఒడిశా రైలు ప్రమాద స్థలంలో సహాయక చర్యలు ముగిసిన కారణంగా.. ట్రాక్​ పునరుద్ధరణ పనులపై దృష్టి సారించింది అధికార యంత్రాంగం. చీకట పడ్డగానీ పునరుద్దరణ పనులకు ఇబ్బందులు కలగకుండా.. పెద్ద పెద్ద లైట్లను ఏర్పాటు చేశారు అధికారులు. కాగా పునరుద్ధరణ పనులను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ దగ్గరుండి మరి పర్యవేక్షించారు.

odisha-train-accident-restoration-work-ashwini-vaishnaw-oversees-restoration-works
పునురుద్ధరుణ పనులు పర్యవేక్షిస్తున్న రైల్వే మంత్రి..

Odisha Train Accident Restoration : ఒడిశా బాలేశ్వర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో సహాయ చర్యలు పూర్తికావడం వల్ల ట్రాక్‌ పునరుద్దరణ పనులను చేపట్టారు అధికారులు. శనివారం రాత్రి నుంచి వెయ్యి మందికిపైగా కార్మికులు ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. చీకట్లో పనులకు ఇబ్బంది కలగకుండా.. పెద్ద పెద్ద లైట్లను ఏర్పాటు చేశారు. ఏడు ప్రొక్లెయిన్లు, రెండు ఎక్సిడెంట్ రిలీఫ్ వ్యాన్లు, 3 నుంచి 4 రైల్వే, రోడ్డు క్రేన్లను పునరుద్దరణ పనులకు ఉపయోగిస్తున్నారు.

చెల్లాచెదురుగా పడిపోయిన బోగీలు, ఇతర చెత్తను.. యంత్రాలతో తొలిగించారు. ట్రాక్‌ మరమ్మతు పనులు సైతం వేగంగా చేపట్టారు. వీలైనంత త్వరగా ట్రాక్‌ను సిద్ధం చేసి రాకపోకలను పునరుద్ధరిస్తామని తూర్పు మధ్య రైల్వే సీపీఆర్​ఓ ఆదిత్య కుమార్‌ చౌదరి తెలిపారు. గూడ్స్ బోగిలపైకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కిందని తెలిపిన ఆదిత్య కుమార్‌.. దాని ఇంజిన్‌ను దించేందుకు రెస్క్యూ టీం ప్రయత్నిస్తున్నారని చెప్పారు. పవర్ లైన్​ను కూడా సహాయక బృందాలు పునరుద్ధరణ చేస్తున్నట్లు ఆయన వివరించారు.

odisha-train-accident-restoration-work-ashwini-vaishnaw-oversees-restoration-works
కొనసాగుతున్న ట్రాక్​ పునరుద్దరణ పనులు

దగ్గరుండి పునురుద్ధరుణ పనులు పర్యవేక్షిస్తున్న రైల్వే మంత్రి..
ఒడిశా రైలు ప్రమాదం స్థలంలో ట్రాక్​ పునరుద్ధరణ పనులను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రాత్రంతా అక్కడే ఉండి అధికారులకు దిశా నిర్ధేశం చేశారు. వీలైనంతా త్వరగా ట్రాక్​ పునరుద్ధరణ పనులను పూర్తి చేస్తామని రైల్వే అధికారులు తెలిపారు. ప్రాథమిక నివేదిక ప్రకారం.. ప్రమాదానికి గురైన రెండు ప్యాసింజర్​ రైళ్లకు చెందిన 17 బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వారు వెల్లడించారు. మొత్తంగా శుక్రవారం జరిగిన ఈ ఒడిశా రైలు ప్రమాదంలో 275 మంది మృతి చెందారు. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు.

odisha-train-accident-restoration-work-ashwini-vaishnaw-oversees-restoration-works
దగ్గరుండి పునురుద్ధరుణ పనులు పర్యవేక్షిస్తున్న రైల్వే మంత్రి

మాటలకు అందని విషాదం నింపిన ఈ ఒడిశా రైలు ప్రమాద ఘటనలో.. అంతకుముందు 18 గంటలు నిర్విరామంగా సహాయక చర్యలు జరిగాయి. ఎన్​డీఆర్​ఎఫ్​, ఎస్​డీఆర్​ఎఫ్​, త్రివిధ దళాలు సైతం సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. నుజ్జైన బోగీల నుంచి క్షతగాత్రుల్ని అత్యంత జాగ్రత్తగా వెలికితీసి ఆస్పత్రులకు పంపాయి. మృతదేహాల్ని బయటకు తీశాయి.

  • #WATCH | Odisha: Aerial visuals from ANI’s drone camera show the restoration work underway at the site of #BalasoreTrainAccident

    As per the Railway Ministry, 1000+ manpower engaged in the work. More than 7 Poclain Machines, 2 Accident Relief Trains, 3-4 Railway and Road Cranes… pic.twitter.com/9vg2wCulyd

    — ANI (@ANI) June 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఘటనపై అధికారులకు సమాచారం ఇచ్చిన ఎన్​డీఆర్​ఎఫ్​ జవాన్
రైలు ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు అక్కడికి తొందరగా చేరుకోవడానికి.. ఓ ఎన్​డీఆర్​ఎఫ్ ​జవాన్ కారణమని తెలిసింది. ఘటన జరిగిన వెంటనే జవాన్ వెంకటేశ్.. తమకు సమాచారమిచ్చారని అధికారులు చెప్పారు. సెలవుపై సొంత రాష్ట్రం తమిళనాడుకు హౌవ్​డా నుంచి కోరమాండల్ ఎక్స్​ప్రెస్‌లో వెంకటేష్‌ బయల్దేరారరు. అదృష్టవశాత్తు జవాన్ ప్రయాణిస్తున్న B-7 బోగీకి ప్రమాదం జరగలేదన్నారు అధికారులు. దీంతో ఆయన ప్రాణాలతో బయటపడి.. వెంటనే తన ఫోన్‌ నుంచి లైవ్ లొకేషన్‌ను ఎన్​డీఆర్​ఎఫ్​ కంట్రోల్ రూమ్‌కు పంపిచారన్నారు. సహాయక బృందాలు అక్కడకు వచ్చే లోపు స్థానికులతో కలిసి పలుపురిని రక్షించారు ఎన్​డీఆర్​ఎఫ్​ జవాన్ వెంకటేష్​.

Last Updated :Jun 4, 2023, 2:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.