ETV Bharat / bharat

Monthly Assistance Scheme for Women : మహిళలకు నెలకు రూ.1000.. కొత్త పథకం ప్రారంభించిన సీఎం

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 15, 2023, 1:33 PM IST

monthly-assistance-scheme-for-women-in-tamilnadu-cm-stalin-launches-rs-1000-monthly-for-women
మహిళలకు నెలవారీ రూ 1000 ఆర్థిక సాయం పథకం

Monthly Assistance Scheme for Women in Tamilnadu : తమిళనాడు ప్రభుత్వం మహిళల కోసం కొత్త పథకాన్ని ప్రారంభించింది. 'కలైంజ్ఞర్ మహిళల హక్కుల పథకం' పేరుతో.. ఇంటి పెద్దకు నెలకు వెయ్యి రూపాయలు సాయం అందించే పథకానికి శ్రీకారం చుట్టింది. దివంగత నేత సీఎన్ అన్నాదురై జయంతి సందర్భంగా శుక్రవారం ఈ పథకాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి స్టాలిన్​.

Monthly Assistance Scheme for Women in Tamilnadu : మహిళలకు నెలకు వెయ్యి రూపాయల సాయం అందించే పథకాన్ని ప్రారంభించింది తమిళనాడు ప్రభుత్వం. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ద్రావిడ ఐకాన్, దివంగత నేత సీఎన్ అన్నాదురై జయంతి సందర్భంగా శుక్రవారం ఈ పథకాన్ని ప్రారంభించారు తమిళనాడు సీఎం ఎమ్​కే స్టాలిన్​. 'కలైంజ్ఞర్ మహిళల హక్కుల పథకం' పేరుతో.. కుటుంబ పెద్ద అయిన మహిళకు ఈ సాయాన్ని అందించనుంది డీఎమ్​కే ప్రభుత్వం.

కాంచీపురం జిల్లాలో అధికారికంగా ఈ పథకాన్ని ప్రారంభించారు స్టాలిన్. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి​.. అన్నాదురై జయంతి రోజున, కరుణానిధి శతజయంతి తరుణంలో ఈ పథకాన్ని ప్రారంభించడం గర్వ కారణమన్నారు. 'కలైంజ్ఞర్ మహిళల హక్కుల పథకం'.. విప్లవాత్మకమైనదని ఆయన అభివర్ణించారు. ఇది రాష్ట్ర మహిళల జీవితాల్లో పునరుజ్జీవనానికి దారి తీస్తుందని వివరించారు.

"ఇంటి పెద్ద అయిన మహిళకు సంవత్సరానికి రూ.12వేలు ఇస్తున్నాం. ఈ పథకం వారికి ఎంతో భరోసాను ఇస్తుంది. ఇది అభివృద్ధికి చిహ్నం. 'కలైంజ్ఞర్ మహిళల హక్కుల పథకం' మహిళల జీవన ప్రమాణాలను పెంచుతుంది. వారిని ఆత్మగౌరవంతో బతికేలా చేస్తుంది. పేదరికాన్ని రూపు మాపుతుంది." అని స్టాలిన్ పేర్కొన్నారు.

ఈ పథకంలో భాగంగా మొత్తం 1కోటి 6లక్షల 50వేల మందిని లబ్ధిదారులుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ వెయ్యి రూపాయల సాయం నేరుగా మహిళల బ్యాంక్​ ఖాతాల్లో జమ అవుతుంది. 2023 జులై నుంచి క్యాంపులు ఏర్పాటు చేసి.. అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరించింది ప్రభుత్వం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు-2021 సందర్భంగా.. తన పార్టీ మేనిఫెస్టోలో ఈ పథకాన్ని ప్రకటించింది డీఎమ్​కే పార్టీ.

శుక్రవారం కాంచీపురం వెళ్లిన ముఖ్యమంత్రి స్టాలిన్​.. అన్నాదురై 115 జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కలైంజర్ మహిళల హక్కుల పథకాన్ని ప్రారంభించారు. 1949లో ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎమ్​కే) పార్టీని స్థాపించారు అన్నాదురై. కాచీపురం ఆయన స్వస్థలం. 1967 నుంచి 1969 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు అన్నాదురై.

Amicus Curiae On Convicted Representatives : 'ఆ కేసుల్లో శిక్షపడితే శాశ్వతంగా చట్టసభల్లో నిషేధించాలి'.. సుప్రీం కోర్టుకు నివేదిక..

Udhayanidhi Stalin On BJP : 'బీజేపీ ఓ 'విషసర్పం'.. వెళ్లగొట్టాలంటే ముందు ఆ పార్టీ పని పట్టాలి!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.