ETV Bharat / bharat

ఆంధ్ర, తెలంగాణ సీఎంలకు స్టాలిన్​ లేఖ.. ఎందుకంటే?

author img

By

Published : Oct 4, 2021, 4:57 PM IST

Updated : Oct 4, 2021, 5:32 PM IST

stalin
స్టాలిన్​

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ సహా 12 రాష్ట్రాల సీఎంలకు లేఖ రాశారు ఎంకే స్టాలిన్(stalin cm of tamil nadu)​. అందులో నీట్​ను ప్రస్తావించారు తమిళనాడు సీఎం(stalin neet news). విద్యాశాఖ నిర్వహణ రాష్ట్రాల చేతుల్లోనే ఉండాలని బలంగా చెప్పారు.

కేంద్ర ప్రవేశపెట్టిన నీట్​ పరీక్షను అడ్డుకునేందుకు మద్దతు కూడగడుతున్నారు తమిళనాడు సీఎం ఎం.కే స్టాలిన్(stalin cm of tamil nadu )​. విద్యావ్యవస్థలో రాష్ట్రాలకే ప్రాధాన్యం ఉండేలా చూడడంలో సహకారం అందించాలని పిలుపునిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు స్టాలిన్​. అంతేకాకుండా.. ఆయా రాష్ట్రాల్లోని అగ్రనేతలతో సంప్రదింపులు జరిపేందుకు పార్టీ ఎంపీని పంపించారు(neet tamil nadu issue).

సీఎంలకు రాసిన లేఖలో నీట్​పై వ్యతిరేకత తెలియచేశారు స్టాలిన్​(stalin neet news).

"కేంద్రం నీట్​ను ప్రవేశపెట్టి.. సమాఖ్యవాదాన్ని దెబ్బతీసింది. ఈ విషయాన్ని మేము ఎప్పటి నుంచో చెబుతున్నాము. వైద్యవిద్యా వ్యవస్థ నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కేంద్రం తీసుకుని మన హక్కులను హరిస్తోంది. ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలు రాష్ట్రాల చేతుల్లోనే ఉండాలి."

--ఎం.కే స్టాలిన్​, తమిళనాడు సీఎం.

ఈ నెల 1న స్టాలిన్​ ఈ లేఖ రాసినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ, ఛత్తీస్​గఢ్​, దిల్లీ, ఝార్ఖండ్​, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్​, రాజస్థాన్​, బంగాల్​, గోవా సీఎంలకు ఈ లేఖలు వెళ్లాయి.

నీట్​పై జస్టిస్​ ఏకే రాజన్​ కమిటీ రూపొందించిన నివేదికను కూడా లేఖతోపాటు పంపారు స్టాలిన్​. నివేదికను చదివి, గ్రామీణ, అట్టడుగు వర్గాల విద్యార్థులు మెరుగైన స్థితిలో నిలిచి, ఉన్నత విద్యను అందుకునే విధంగా మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు.

విద్యార్థుల ఆత్మహత్యలు..

నీట్​ పరీక్ష నేపథ్యంలో ఇటీవలి కాలంలో పలువురు తమిళనాడు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 12వ తరగతిలో 93.6 శాతం ఉత్తీర్ణతతో టాపర్​గా నిలిచిన ఓ విద్యార్థిని.. నీట్​ పరీక్ష బాగా రాయలేదన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. అంతకుముందు సేలం జిల్లాలో ధనుష్​ అనే విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. ఇప్పటికే రెండుసార్లు నీట్​ పరీక్ష రాసిన ఆ విద్యార్థి.. ఈసారి కూడా ఉత్తీర్ణత సాధించకపోతే.. ఎంబీబీఎస్​ చేయాలన్న తన కల కలగానే మిగిలిపోతుందనే మనోవేదనతోనే ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ ఘటనలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. నీట్ పరీక్ష నుంచి తమిళనాడును శాశ్వతంగా మినహాయించే బిల్లుకు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. జస్టిస్​ రాజన్​ కమిటీ రూపొందించిన నివేదిక ఆధారంగానే ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఇతర రాష్ట్రాల మద్దతు కూడగట్టేందుకు స్టాలిన్​ సీఎంలకు లేఖలు రాశారు.

ఇదీ చూడండి:- 'యువవైద్యులను ఫుట్​బాల్​లా భావించొద్దు'

Last Updated :Oct 4, 2021, 5:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.