ETV Bharat / bharat

ఈ పిజ్జా అరగంటలో తింటే రూ.20వేల బహుమానం

author img

By

Published : Aug 13, 2021, 6:24 PM IST

pizza, kashmir pizza
పిజ్జా, కశ్మీర్​ పిజ్జా

పిజ్జా తినాలని చాలా మందికి ఆశగా ఉంటుంది. ఇలాంటి పిజ్జా ప్రియులకు ఓ బంపర్​ ఆఫర్​ ఇస్తున్నాడు కశ్మీర్​కు చెందిన ఓ రెస్టారెెంట్ యజమాని. తాము ఇచ్చిన పిజ్జా మొత్తం తింటే రూ. 20,000 బహుమానంగా ఇస్తామని చెబుతున్నాడు. మరి అలా ఎందుకు చేస్తున్నాడో తెలుసుకుందాం..

పిజ్జా తినండి- రూ.20వేలు పొందండి

చాలా మందికి పిజ్జా చూడగానే నోరూరుతుంది. వెంటనే ఒక్క బైట్​ అయినా తినేయాలనిపిస్తుంది. మరి అలాంటి పిజ్జాను ఉచితంగా ఇస్తున్నారంటే?. అది కూడా పూర్తిగా తిన్నవారికి నగదు ఇస్తున్నామని చెబితే?.. పిజ్జా ప్రియులు క్యూలో నిల్చుంటారనడంలో సందేహం అక్కర్లేదు. ఇలాంటి వినూత్న ఆలోచనతోనే కస్టమర్లను ఆకర్షించేందుకు ఓ ఛాలెంజ్​తో ముందుకొచ్చాడు శ్రీనగర్​కు చెందిన ఓ పిజ్జా షాపు ఓనర్.

pizza, kashmir
భారీ పిజ్జా..

అరగంటలో తాము ఇచ్చే పిజ్జా తింటే రూ. 20,000 బహుమతిగా ఇస్తామని ప్రకటించాడు. పిజ్జాకు డబ్బులు కూడా తీసుకోమని తెలిపాడు. అయితే.. ఇతర దేశాల్లో ఇలాంటి ఛాలెంజ్​లు మనం తరచూ చూస్తున్నప్పటికీ కశ్మీర్​లో ఇదే తొలిసారి అంటున్నాడు పిజ్జా షాపు ఓనర్ ఇస్రార్ అహ్మద్ మీర్.

"కశ్మీరీ ప్రజలు ఈ ఛాలెంజ్​ను స్వీకరిస్తున్నారు. ఇలాంటి ఫుడ్​ ఛాలెంజ్​లు ఉండాలని మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటివరకు పిజ్జా ఛాలెంజ్​లో ఆరుగురు పాల్గొన్నారు. ఎవరూ ఛాలెంజ్​ నెగ్గలేదు. కానీ, దీన్ని స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. ఓ వ్యక్తి మాత్రం 90శాతం పిజ్జా తినగలిగాడు."

--ఇస్రార్ అహ్మద్ మీర్, పిజ్జా షాపు ఓనర్.

నాగిన్​లోని అత్లానే స్టోర్​లో ఈ ఛాలెంజ్​ కోసం ప్రత్యేకమైన పిజ్జాను తయారు చేస్తున్నాడు ఆ షాపు ఓనర్. గుండ్రంగా ఉండే పిజ్జా కాకుండా 30 ఇంచుల స్క్వేర్​ షేప్​ పిజ్జాను తయారు చేయిస్తున్నాడు. అయితే.. ఈ స్పెషల్​ పిజ్జాను తయారు చేసేందుకు 45 నిమిషాలు సమయం పడుతుందని తెలిపాడు.

రానున్న రోజుల్లో మరిన్ని ఆఫర్లతో ముందుకు రానున్నట్లు అహ్మద్ మీర్ చెప్పాడు. ప్రస్తుతం కశ్మీరీ ప్రజలు ఈ ఆఫర్​ను స్వీకరించేందుకు ముందుకు రావడం ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశాడు.

ఇదీ చదవండి:20 అడుగుల కింగ్​కోబ్రా- ప్రపంచంలోనే మోస్ట్​ డేంజరస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.