ETV Bharat / bharat

మద్యం మత్తులో కన్నతల్లినే..

author img

By

Published : Jul 9, 2021, 10:47 PM IST

Updated : Jul 9, 2021, 11:23 PM IST

మద్యం మత్తులో ఓ వ్యక్తి క్రూరంగా ప్రవర్తించాడు. డబ్బుల కోసం తన తల్లితో వాగ్వాదానికి దిగి.. అనంతరం ఆమెను హత్య చేశాడు. కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలో జరిగిందీ దారుణం.

son killed mother
తల్లిని చంపిన కుమారుడు

మద్యం మత్తులో పేగుబంధాన్ని మరిచి ప్రవర్తించాడు ఓ వ్యక్తి. డబ్బుల కోసం గొడవపడి కన్నతల్లినే కడతేర్చాడు. ఈ అమానవీయ ఘటన కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలో జరిగింది.

son killed mother
మృతురాలు రత్నమ్మ

ఇనుప రాడ్డుతో..

మోలకల్మూ​రులో నివసించే రత్నమ్మ(45) కుమారుడు లోకేశ(22).. ఫూటుగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. అనంతరం.. డబ్బులు కావాలని తన తల్లిని వేధించాడు. వాగ్వాదానికీ దిగాడు. అయితే డబ్బులిచ్చేందుకు ఆమె నిరాకరించింది. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన లోకేశ.. తన తల్లిని ఇనుపరాడ్డుతో గట్టిగా మోదాడు. తీవ్రంగా గాయపడ్డ రత్నమ్మ అక్కడికక్కడే మృతి చెందిందని పోలీసులు తెలిపారు.

son killed mother
నిందితుడు లోకేశ
son killed mother
కుమారుడు చేతిలో గాయపడి మృతి చెందిన రత్నమ్మ

స్థానికులు ఈ విషయంపై పోలీసులకు తెలియజేయగా వారు ఘటనాస్థలికి చేరుకున్నారు. నిందితుడు లోకేశను అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ జి.రాధిక తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

ఇదీ చూడండి: ఇంటికి అన్నీ తానై.. 13 ఏళ్లకే రైతుగా..

ఇదీ చూడండి: అతి చిన్న వయసులో రికార్డు 'పంచ్'​లు

Last Updated :Jul 9, 2021, 11:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.