ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్‌లో ఎదురుకాల్పులు- ఇద్దరు ఉగ్రవాదులు హతం

author img

By

Published : Jan 10, 2022, 1:54 AM IST

JK encounter news
ఎదురుకాల్పులు

JK Encounter News: జమ్ముకశ్మీర్​ కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి భద్రతా బలగాలు.

JK Encounter News: జమ్ముకశ్మీర్​లో​ ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్​కౌంటర్​ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

ఉగ్రవాదులున్నారన్న సమాచారం మేరకు కుల్గాం జిల్లా హసన్‌పొరా ప్రాంతంలో తనిఖీలు చేపట్టాయి భద్రతా దళాలు. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు.

ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి లభించినట్లు చెప్పారు.

ఇదీ చదవండి: బోటులో నుంచి సముద్రంలో పడిన మహిళ.. అంతలోనే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.