ETV Bharat / bharat

ఉపాధి పేరుతో తీసుకెళ్లి యువతిపై 11మంది అత్యాచారం

author img

By

Published : Mar 9, 2021, 10:57 AM IST

ఉపాధి కల్పిస్తామని తీసుకెళ్లి.. ఓ యువతిపై కారులోనే 11మంది అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన రాజస్థాన్​ జైపుర్​లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వీడియో వైరల్​ కావటం వల్ల పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Jaipur: UP woman gang-raped in moving car
నడుస్తున్న కారులో యువతిపై 11మంది అత్యాచారం

ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఓ యువతిని.. ఉపాధి కల్పిస్తామని తీసుకెళ్లి 11 మంది కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రాజస్థాన్ జైపుర్​లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఏం జరిగింది?

ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఓ యువతి.. ఉపాధి కోసం 2020 అక్టోబర్​లో రాజస్థాన్​లోని జైపుర్​కు వచ్చింది. మానస సరోవర్​లోని ఓ హోటల్​లో బస చేసింది. ఆమె సన్నిహితుడు ఫోన్ చేసి.. 'పని ఉంది. చేస్తే భారీగా డబ్బు ఇస్తారు'. అని చెప్పాడు. అది నిజమే అని భావించిన యువతి.. అక్కడికి వెళ్లింది. ఈ క్రమంలో మూడు కార్లలో వచ్చిన 11మంది ఆ యువతిపై కారులోనే అత్యాచారం చేశారు.

తాజాగా ఆ వీడియో వైరల్ అయింది. ఈ ఘటనపై జైపుర్ అదనపు కమిషనర్​ అజయ్​ పాల్ లంబా స్పందించారు. అత్యాచారం కార్​లో జరిగినట్లు వీడియోలో ఉందన్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఈ కేసులో భాగంగా ఉత్తర్​ప్రదేశ్​లో ఉన్న బాధితురాలి చిరునామా సేకరించి.. ఆమెను జైపుర్​కు తీసుకువచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే ఓ నిందితున్ని అదుపులోకి తీసుకున్నామన్నారు.

ఇదీ చదవండి : బాణసంచా ఫ్యాక్టరీ ప్రమాదంలో 25కు మృతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.