ETV Bharat / bharat

దేశంలో మరో 13,742 కేసులు.. 104 మరణాలు

author img

By

Published : Feb 24, 2021, 9:47 AM IST

Updated : Feb 24, 2021, 9:58 AM IST

దేశంలో మరో 13,742 మంది కరోనా​ బారినపడ్డారు. మొత్తం బాధితుల సంఖ్య 1కోటీ 10లక్షల 30వేల 176కు చేరింది. మంగళవారం ఒక్కరోజే 14,037 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.

INDIA CORONA VIRUS UPDATES
దేశంలో మరో 13,742 మందికి కరోనా

దేశంలో సోమవారంతో పోల్చితే మంగళవారం కరోనా కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 13,742 మందికి కొవిడ్​​​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మరో 104 మంది వైరస్​కు బలయ్యారు.

  • మొత్తం కేసులు: 1,10,30,176
  • మరణాలు: 1,56,567
  • రికవరీల సంఖ్య: 1,07,26,702
  • యాక్టివ్​ కేసులు: 1,46,907

కొవిడ్​ బారినపడిన వారిలో 14,037 మంది కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్త రికవరీ రేటు 97.25 శాతానికి పెరిగింది. మరణాల రేటు స్థిరంగా 1.42 శాతంగా ఉంది.

దేశవ్యాప్తంగా మరో 4,20,046 మందికి కొవిడ్​ టీకా అందించినట్టు ఆరోగ్య శాఖ తెలిపింది. ఫలితంగా మొత్తం లబ్ధిదారుల సంఖ్య 1కోటీ 21లక్షల 65వేలు దాటినట్టు పేర్కొంది.

ఇదీ చదవండి: 1.19 కోట్ల టీకా డోసుల పంపిణీ: కేంద్రం

Last Updated : Feb 24, 2021, 9:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.