ETV Bharat / bharat

తండ్రితో కలిసి భార్యను హతమార్చిన డాక్టర్.. శవాన్ని అంబులెన్సులో 350కి.మీ తీసుకెళ్లి..

author img

By

Published : Dec 13, 2022, 4:48 PM IST

husband kills wife
భార్యను హత్య చేసిన భర్త

ఓ వైద్యుడు తన తండ్రితో కలిసి భార్యను హతమార్చాడు. అత్తవారు పెళ్లికి కట్నంగా ఇచ్చిన పెట్టెలోనే భార్య మృతదేహాన్ని పెట్టి దూరంగా తీసుకెళ్లి దహనం చేశాడు. ఈ దారుణం ఉత్తర్​ప్రదేశ్​లో వెలుగుచూసింది.

ఉత్తర్​ప్రదేశ్ లఖింపుర్​ ఖేరీలో దారుణం జరిగింది. ఓ వైద్యుడు తన భార్యను దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని పెట్టెలో పెట్టి 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న గఢ్​ముక్తేశ్వర్​కు తీసుకెళ్లి దహనం చేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు తన భార్య కనిపించలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 20 రోజుల కిందట జరిగిన ఈ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు, అతడి తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు.

husband kills wife
మృతురాలు వందన

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
రాయ్‌పుర్ గ్రామానికి చెందిన వందనా శుక్లా (28)కు అభిషేక్ దీక్షిత్​ అనే వైద్యుడితో 2014లో వివాహం జరిగింది. వందనా శుక్లా కూడా డాక్టరే. దంపలిద్దరూ సీతాపుర్​లో ఓ ఆస్పత్రిని నిర్మించుకుని అక్కడే ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో కొన్నాళ్లుగా భార్యాభర్తలు మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆ తర్వాత వందన.. చమల్‌పుర్‌లోని లక్ష్మీ నారాయణ్ హాస్పిటల్‌లో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించింది. దీంతో కోపోద్రిక్తుడైన నిందితుడు అభిషేక్, అతడి తండ్రి గౌరీ శంకర్.. నవంబరు 26న వందనపై కర్రలతో దాడి చేసి హతమార్చారు. ఆ తర్వాత ఇద్దరూ వందన మృతదేహాన్ని పెట్టెలో పెట్టి గౌరీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఉదయం అంబులెన్స్‌ను అద్దెకు తీసుకుని వందన మృతదేహాన్ని గఢ్​ముక్తేశ్వర్​కు తీసుకెళ్లి దహనం చేశారు.

ఈ క్రమంలో నవంబరు 27న మృతురాలి తండ్రి శివరాజ్​ శుక్లా.. తన కూతురు కనిపించట్లేదని అల్లుడు అభిషేక్​తో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఫోన్​కాల్ డేటా పరిశీలించారు. మృతదేహాన్ని తరలించిన అంబులెన్స్ డ్రైవర్​ను ప్రశ్నించారు. అతడి వాంగ్మూలం ఆధారంగా అసలు విషయం బయటపడింది.

అంబులెన్స్​ డ్రైవర్​కు అనుమానం..
వందన మృతదేహాన్ని అంబులెన్స్‌లోకి ఎక్కించేటప్పుడు ఆమె తలనుంచి రక్తం కారుతోంది. ఇది చూసిన అంబులెన్స్​ డ్రైవర్.. నిందితుడు అభిషేక్​ను ప్రశ్నించాడు. అయితే, డ్రైవర్​కు అభిషేక్ ఏదో కథ చెప్పాడు. తన భార్య స్కూటీపై వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి మరణించిందని కథ అల్లాడు. పోస్టుమార్టం ఇష్టంలేక ఇలా సీక్రెట్​గా మృతదేహాన్ని తరలిస్తున్నామని తెలిపాడు. పోలీసులు అంబులెన్స్ డ్రైవర్​ను విచారించగా అతడు ఈ విషయాన్ని బయటపెట్టాడు. దీంతో నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. వారిద్దరూ తమ నేరాన్ని అంగీకరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.